(చాడా శాస్త్రి)
సుప్రీంకోర్టు పక్షపాత ధోరణి ని బహిర్గతం చేసిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు లేదా తీర్పులు చూడండి.
1. వక్ఫ్ చట్ట సవరణలు:
కాంగ్రెస్ వక్ఫ్ సవరణ చట్టం 2013 ను తీసుకువచ్చినప్పుడు, చాలా మంది హిందూ న్యాయవాదులు ఇది హిందూ వ్యతిరేకమని మరియు రాజ్యాంగ వ్యతిరేకమని భావించి సుప్రీంకోర్టును ఆశ్రయించారు, కానీ సుప్రీంకోర్టు వారి వాదనలు వినడానికి నిరాకరించి హైకోర్టుకు పొమ్మంది.
12 సంవత్సరాల తర్వాత బిజెపి వక్ఫ్ సవరణ చట్టం 2025 ను తీసుకువచ్చినప్పుడు ఈసారి ముస్లింలు దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈసారి సుప్రీంకోర్టు స్పందన పూర్తిగా భిన్నంగా ఉంది. ఈసారి సుప్రీంకోర్టు వారిని హైకోర్టుకు వెళ్లమని అడగలేదు, పై పెచ్చు అత్యవసర ప్రాతిపదికన విచారణ ప్రారంభించి, తొందరగా పూర్తి చేయాలనే కుతూహలం చూపిస్తోంది.
2. కాశీ జ్ఞానవాపి, ధార్ భోజ్శాల, కృష్ణ జన్మభూమి కేసులలో కంటికి కనిపించే ఆధారాలు, శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పటికీ, కోర్టులు హిందువులకు ఇప్పటి వరకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కానీ, వందల సం. ల క్రిందట వక్ఫ్ ఆస్తులకు రుజువులు కాగితాలు ఎలా ఉంటాయి అని ఇదే సుప్రీం ప్రశ్న లేవనెత్తింది.
3. ఆ ఒక్క అంశం వల్ల ఈ దేశంలోహిందూ స్త్రీలు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు అని ప్రపంచానికి చాటే లాగా శబరిమల దేవాలయం లోకి మహిళల ప్రవేశం పై ఏ సంబంధం లేని ఒక NGO పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నేరుగా హిందూ దేవాలయాల అగమశాస్త్ర నిర్వహణ వ్యవస్థ లో వేలు పెట్టి స్త్రీల ప్రవేశం పై ఆంక్షలను రద్దు చేసింది. కానీ మసీదులలోకి మహిళల ప్రవేశంపై ఉన్న ఆంక్షలు పై వేసిన పిటిషన్ కోల్డ్ స్టోరేజి లో పెట్టింది, ఇప్పటికి 6సం. లు అయింది. కేసు అతీ గతీ లేదు.
4. ముస్లింలు, క్రిస్టియన్స్ తమ ప్రార్ధనా మందిరాలను ఆస్తులను వారే స్వతంత్రంగా చూసుకుంటున్నారు, కానీ, దేవాలయాలు ప్రభుత్వ అజమాయిషీ లో ఉన్నాయి. స్వతంత్రంగా వ్యవహరించే అదే తరహా వెసులుబాటు హిందువులకు జైనులకు కూడా కల్పించండి అని అశ్వని ఉపాధ్యాయ అనే న్యాయవాది వేసిన పిటిషన్ కొట్టేసింది.
5. శతాబ్దాలుగా హిందువుల గ్రామదేవతలకు మరి కొన్ని దేవతలకు కొన్ని పండుగలు అప్పుడు బలులు ఇచ్చే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. దీనిపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. కానీ బక్రీద్ సందర్భంగా భారీ ఎత్తున జంతు బలులు గురించి అసలు తెలియనట్లే ప్రవర్తిస్తోంది.
6. ప్రార్ధనా మందిరాలలో జరిగే తంతుకు ఏ మాత్రం సంబంధం లేకుండా, కేవలం జస్ట్ మత ఆస్తులు మాత్రమే పర్యవేక్షణ చేసే వక్ఫ్ బోర్డ్ లో ముస్లిమేతరులను ఎలా వేస్తారు, ఇలాగే హిందూ దేవాలయ బోర్డ్స్ లో వేస్తే ఒప్పుకుంటారా? అని మొన్న ప్రశ్నించిన సుప్రీంకోర్టు..
ఆగమశాస్త్ర పద్దతులపై నడిచే దేవాలయ ట్రస్ట్ బోర్డ్స్ లో ఇప్పటికే పలుసార్లు హైందవేతరులను వేశారు అని ఇప్పటికి వందల సంఖ్యలో అన్యమతస్తులు దేవాలయాలలో పనిచేస్తున్నారని సంగతి ధర్మప్రభువులకు తెలియదా?
7. 1990లో కాశ్మీర్ లో హిందువుల ఊచకోతపై విచారణ జరిపి నేరస్తులను శిక్షించండి అంటే 30 సం. ల క్రిందట కేసు సాక్ష్యాలు ఎలా లభిస్తాయి అంటూ పిటిషన్ తిరస్కరించింది. అసలు విచారణ జరపకుండా సాక్ష్యాలు దొరకవు అని సుప్రీం ముందే ఎలా నిర్ణయించి కేసు విచారణ ఎలా నిరాకరించింది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం కాదూ?
మరోవైపు ఇదే సుప్రీంకోర్టు 1984 సిక్కుల మారణ కాండపై విచారణకు 33 సం.ల తర్వాత అంటే 2017 లో సిట్ నియమించింది.
ఇవి కొన్ని ముఖ్యమైనవి మాత్రమే… ఇంకా హిందూ వ్యక్తిగత చట్టాలు విషయంలో న్యాయవ్యవస్థ తీర్పులు కొన్ని సార్లు జగుప్సను కలిగిస్తున్నాయి.
ఇక చివరిగా…
హిందువులకు ఏ ఇబ్బంది వచ్చినా హింసకు పాల్పడరు, రోడ్లు బ్లాక్ చేయరు, ఆస్తులు ధ్వంసం చేయరు. కోర్టులో కేసు వేసి న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉంచి న్యాయం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తారు.
రోడ్లు బ్లాక్ చేసి హింసకు పాల్పడరు కాబట్టి హిందువులు అంటే న్యాయవ్యవస్థ కు కూడా గౌరవం లేదు, సానుభూతి అసలు లేదు. సమాజమూ, పాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ కూడా పెద్ద గొంతుకులకు, హింస కు అల్లరికి మాత్రమే స్పందిస్తున్నట్లు కనిపిస్తోంది. దీర్ఘకాలం లో ఇది సమాజానికి మంచిది కాదు. పది మంది గోలకి నేడు లొంగితే రేపు వంద, ఆపై వెయ్యి గొంతులు లేస్తాయి.
గుర్తుంచుకోండి. “ఏడ్చే బిడ్డకే తల్లి కూడా మొదటి ముద్ద పెడుతుంది” ఇది హిందువులు తప్పక గుర్తుంచుకోవలసిన సూత్రం. హిందూ ఎప్పుడూ హింసకు దూరంగానే ఉంటారు. అదే వారి బలం. కానీ గొంతు ఉంది అనే సంగతి కూడా మరిచిపోయారు. అన్యాయం పై మాట్లాడటానికి కూడా మొహమాటం పడుతున్నారు.