Suryaa.co.in

Andhra Pradesh

ఇటువంటి అవినీతి, అసమర్ధ ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే లు ఈ రాష్ట్రానికి అవసరమా?

★జగన్ 2లక్షల55 వేల కోట్లు దోచుకుంటే.. మైలవరం ఎమ్మెల్యే 1000 కోట్లు.. మంత్రి జోగి రమేష్ 500 కోట్లు దోచుకున్నారు
★దోచుకోవటం దాచుకోవడం తప్ప రైతును పట్టించుకునే తీరికలేదు
★ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వదిలి బయటకు రావాలి
★నేషనల్ హైవే పై టెంట్లు, రెడ్ కార్పెట్ వేసుకొని పరామర్శించే ముఖ్యమంత్రి రైతులకు ఏం న్యాయం చేస్తాడు?
★అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న రైతులు, కౌలు రైతుల బాధలు ముఖ్యమంత్రికి పట్టడం లేదు
★4ఏళ్లుగా కాలవలు డ్రైన్లు బాగు చేసిన పాపాన పోలేదు రైతుల సొంత ఖర్చులతో బాగు చేయించుకున్నారు
★మైలవరం ఎమ్మెల్యే అసమర్థత వల్లే బుడమేరుకు ఈ దుస్థితి
★తుఫానుకు తీవ్రంగా నష్టపోయి రైతు కష్టంలో ఉంటే మైలవరం ఎమ్మెల్యే అడ్రస్ లేడు
★బుడమేరు లో 40 లక్షలు దోచేసిన వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ఇది మీ అవినీతి కాదా? మీరు సరిగా పనిచేసే ఉంటే రైతుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు
★నష్టపోయిన ప్రతి రైతుకు, ప్రతి పైరుకు,ప్రతి ఎకరానికి పరిహారం అందించాలి
★తడిసిన, రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ మండలం, రాయనపాడు లో బుడమేరు కాలువ బాగు చేయక ముంపునకు గురై దెబ్బతిన్న పొలాలను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు ఏసీ రూములు వదులు బయటకు రావాలని దోచుకోవటం దాచుకోవటం పై ఉన్న శ్రద్ధ రైతుల కష్టం పై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో శీలంనేని సాంబశివరావు, పోలసాని సుబ్బారావు, రంగినేని నరేంద్ర, అంగిరేకుల శివన్నారాయణ గంట శివరాం ప్రసాదు, గుత్తికొండ ప్రసాదరావు, తాతినేని వెంకటేశ్వరరావు, కాటంనేని జనార్ధన్, హరిబాబు, చైతన్య, తేలు పాపారావు, వేముల శ్రీను, ముప్పవరపు శ్రీనివాసరావు చప్పిడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE