– హైకోర్టు ఆదేశం
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ లీడర్ యడియూరప్పను జూన్ 17 వరకు అరెస్ట్ చేయొద్దని ఆ రాష్ట్ర హైకోర్టు సీఐడీ ని ఆదేశించింది. ఆయన జీవిత చరమాంకంలో ఉన్నారని, అనారోగ్య సమస్యలూ ఎదుర్కొంటున్నారని కోర్టు పేర్కొంది.కాగా పోక్సో చట్టం కింద యడియూరప్ప పై కేసు నమోదవగా నిన్న ఆయనకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో యడ్డీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.