Suryaa.co.in

Telangana

పాత బస్తీ బాగుపడాలంటే బిజెపిని గెలిపించాల్సిందే

– కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటు
– విజయ సంకల్ప యాత్ర లో బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్
-విజయ సంకల్ప యాత్ర తో పాత బస్తీ కాషాయ మయం

హైదరాబాద్ : మోదీని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాము. విజయ సంకల్ప యాత్ర కు గ్రామాల్లో పట్టణాల్లో ఘన స్వాగతం పలుకుతున్నారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోదీ. హిందువుల కోసం అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోదీ.

రాముడే లేదు..రామునికి గుడి ఎందుకు ఆన్న కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రాజకీయం కోసం దేవుడి పేరు వాడుకుంటున్నారు. రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలో.. రామునికి గుడి కట్టిన మోదీ కావాలో ప్రజలు ఆలోచించాలి. కర్ణాటక ఎమ్మెల్సీ నసీర్ షా గెలిచిన సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. మన దేశంలో ఉంటూ, మన దేశ తిండి తింటూ, మన ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటు. వెంటనే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

దేశం సస్యశ్యామలంగా ఉండాలంటే మోదీ ప్రభుత్వంతోనే సాధ్యం. నేను ఉత్తర ప్రదేశ్ నుండి రాజ్య సభ సభ్యుడుగా ఉన్నాను. అక్కడ బిజెపి సీఎం యోగి అధిత్యనాథ్ గ్యాంగ్ స్టార్స్ మాఫియాను బుల్డోజర్లతో కూల్చేశారు. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే హైదరాబాద్ లో బిజెపి నీ గెలిపిస్తే హైదరాబాద్ కూడా సస్యసామలంగా మారుతుంది..

కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీ లు ఓవైసీ తొత్తులుగా మారి పాత బస్తి నీ డెవలప్ జరగకుండా చేస్తున్నారు. బి అర్ ఎస్ కేసీఆర్ కుటుంబం కోసం పని చేస్తుంది. కాంగ్రెస్ నెహ్రూ కుటుంబం కోసం పని చేస్తుంది. కానీ బిజెపి పార్టీ మోది సర్కార్ మాత్రం ప్రజల కోసం దేశం కోసం పని చేస్తుంది. పాత బస్తీ బాగుపడాలంటే బిజెపి నీ గెలిపించాల్సిందే. ఎక్కడ చూసినా ఫిర్ ఏక్ బార్ మోది సర్కార్ అనే నినాదం వినిపిస్తుంది.. ఈ సారి హైదరాబాద్ పార్లమెంట్ లో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయం.

LEAVE A RESPONSE