మంత్రి డెవలపర్స్‌ ఎండీ అరెస్ట్‌

దక్షిణ భారతేదశంలో అతి పెద్ద రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల్లో ఒకరైన మంత్రి డెవలపర్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుశీల్‌ మంత్రి ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు అరెస్ట్‌ చేశారు. మనీ లాండరింగ్‌ ఆరోపణల కింద ఆయనను అరెస్ట్‌ చేశారు. ఈడీ కోర్టులో ఆయనను ప్రేవేశపెట్టగా…పది రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
మంత్రి డెవలపర్స్‌ నుంచి ఫ్లాట్లు కొనుగోలు చేసిన చాలా మంది కంపెనీపై ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి మంత్రి డెవలపర్స్‌పై నిఘా వేసిన ఈడీ అధికారలు.. ఫ్లాట్ల కోసం తీసుకున్న సొమ్మును తమ సొంత కంపెనీలకు బదిలీ చేసినట్లు గుర్తించారు. విచారణ కోసం ఆయనకు సమన్లు పంపామని, విచారణ తరవాత అతన్ని మనీలాండరింగ్ యాక్ట్‌ సెక్షన్‌ 19 కింద ఆయనను అరెస్ట్‌ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు… ఏపి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి సుశీల్ మంత్రి తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాల టాక్.

Leave a Reply