– మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
ప్రకాశం/కనిగిరి : ప్రకాశం జిల్లాను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏప్రిల్ 2 న మంత్రి లోకేష్, అనంత్ అంబానీ శంకుస్థాపన చేయనున్న రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ స్థాపన ఏర్పాట్లు స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియాతో కలిసి శుక్రవారం నాడు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రకాశం జిల్లాను పారిశ్రామిక హబ్ గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వ కృషి చేస్తోంది. కనిగిరితో పాటు త్వరలో మార్కాపురం గిద్దలూరు లో రిలయన్స్ బయో గ్యాస్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కమీషన్ల కక్కుర్తితో జగన్ పరిశ్రమలు తరిమేసి యువతను ఉపాధి లేకుండా చేశారు.
నేడు పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చి ఉద్యోగాలు కల్పించేందుకు మంత్రి లోకేశ్ నిరంతరం శ్రమిస్తున్నారు. రాష్ట్ర యువత కోసం దావోస్ లో లోకేశ్ కాలినడకన పర్యటించారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అన్నారు