విజయవాడ: తేది: 06-12-2021, ఉద్యోగ సంఘ నాయకులు, ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయచ్చు కాని, ప్రభుత్వాన్ని కూల్చుతాం అనడం సబబుగా లేదు. ఇది వారు అలా అని ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వారితో మొన్నటి వరకు కలిసి పనిచేసి ఉన్నాను. ఈనాడు ఉన్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులు మరియు ప్రజలందరి మన్నలు పొంది వచ్చిన ప్రభుత్వం. కావున ప్రజల గురుంచి, అదేవిధంగా ఉద్యోగుల గురుంచి ఆయన ఎప్పుడు సానుకూలంగానే వ్యవహరిస్తారు. కాని కరోనా మహమ్మారి వలన ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందువలన ఉద్యోగులకు రావలసిన రాయితీలు సకాలంలో అందలేదు.
కాని ముఖ్యమంత్రి ఎల్లప్పుడు ఉద్యోగుల పక్షపాతి. ఆయన రాగానే అడగక పోయినా 27 శాతం మధ్యంతర భృతిని మంజూరు చేయడంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థని ప్రభుత్వంలో విలీనం చేయడం మరియు గ్రామ సచివలయాలలో అతి తక్కువ కాలంలో లక్ష ముప్పై వేలమంది ఉద్యోగులను పారదర్శకంగా నియమించడం గొప్ప విషయం. త్వరలోనే 11వ పి.ఆర్.సి ని ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి , ఏ రాష్ట్రంలో లేని విధంగా, ఈ రాష్ట్రంలో బడుగు వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, టీచర్లు మరియు పెన్షనర్లు అందరూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా వున్నారు. కావున ఏ ఒక్క ఉద్యోగి కుడా భాద పడకుండా మన ప్రభుత్వం మనకు రావలసిన రాయితీలను మనకిచ్చిన హామీలను త్వరలోనే పరిష్కరిస్తుంది. మనందరి కోసం కష్టపడి పని చేస్తున్న మన జగనన్న కోసం మనందరం అండగా నిలుద్దాం. మన రాయితీలను త్వరలోనే పొందుదాం.
ముఖ్యమంత్రి గారిని ఉద్యోగస్తులు ఎల్లప్పుడు తమ కుటుంబ పెద్దగా గౌరవిస్తారు. కావున ఏదైనా బాధ కలిగినప్పుడు ఉద్యోగులు కుటుంబ సభ్యులుగా కొంత బాధను వ్యక్తం చేస్తారే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఇలాంటి జగనన్న ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండి, ఆ ప్రభుత్వంలో ఉద్యోగులు పాలు పంచుకోవడం చాలా మంది అదృష్టంగా భావిస్తున్నారు. అయితే కొంతమంది దానిని వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారిని మనం త్రిప్పి కొడదాం.
నలమారు చంద్ర శేఖర్ రెడ్డి
ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం),
రాష్ట్ర మాజీ అధ్యక్షులు,
ఏ.పి.ఎన్జీవో అసోసియేషన్ , చైర్మన్ ఏ.పి. జే.ఏ.సి