– ఆసుపత్రిలో ఉన్నా ఆగని కేసీఆర్ సమీక్షలు
– నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై ఆరా
హైదరాబాద్: తను ఎక్కడున్నా , ఏ పరిస్థితి లో ఉన్నా, తన ధ్యాసంతా పార్టీపైనే చుట్టే కేంద్రీకృతమై ఉంటుందని, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి, కేసీఆర్ మరోసారి రుజువుచేశారు.
సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో బిఆర్ఎస్ అధినేత, అడ్మిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు పార్టీ సీనియర్ నేతలు పరామర్శించేందుకు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అధినేత ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, వ్యవసాయం, సాగునీరు, రైతు సమస్యలు, యూరియా ఎరువుల లభ్యత సహా తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, నేతల కార్యకలాపాలపై ఆయన ఆరా తీశారు.పార్టీ నేతలతో జరిగిన చర్చ సందర్భంగా కేసీఆర్ ఉత్సాహంగా మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.