Suryaa.co.in

Andhra Pradesh

నీలిమీడియా..కూలిమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారం జగన్ రెడ్డి & జే గ్యాంగ్ భయానికి నిదర్శనం

• చంద్రబాబు బయటకు వచ్చి సభలు పెడితే, జగన్ రెడ్డి అవినీతి, అసమర్థత ప్రజలు అర్థం చేసుకుంటారనే అతని భయం
• తాను సింహాన్నని తన భజనపరులతో చెప్పించుకునే జగన్ రెడ్డి గుంటనక్కలా చంద్రబాబుపై కుయుక్తులు..కుట్రలు పన్నుతున్నాడు
• జగన్ రెడ్డి… తాడేపల్లి పెద ముత్తైదు సజ్జల ఎన్ని కుట్రలు పన్నినా… తలకిందులుగా తపస్సు చేసినా చంద్రబాబు తప్పుచేశాడని నిరూపించలేరు
– తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి

చంద్రబాబునాయుడి బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని జగన్ రెడ్డి నీలిమీడియా, దాని అనుబంధ కూలిమీడియా వక్రీకరించి, ప్రజల్ని అబద్ధాలతో నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయని, దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యల్ని కూడా నిర్భయంగా.. నిస్సిగ్గుగా.. నిర్లజ్జగా వక్రీకరించే సాహసానికి నీలి మీడియా దిగజారిందని టీడీపీనేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

“ ‘చంద్రబాబుకు బెయిల్ షరతులు విధించిన సుప్రీంకోర్టు’ అని… ‘గతంలో ఎలాంటి షరతులు లేవని, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవరించిన సుప్రీంకోర్టు’ అని… ‘చంద్రబాబు బెయిల్ షరతులు పాటించాల్సిందే’ అని, ‘బాబు రాజకీయ ర్యాలీలు నిర్వహించకూడదని, కేసుకు సంబంధించిన వివరాలు మీడియాతో మాట్లాడవద్దు’ అని నీలిమీడియానే విషప్రచారం చేస్తోంది. న్యాయస్థానం చెప్పని దాన్ని చెప్పినట్టుగా నీలిమీడియా చేస్తున్న ప్రచారం చంద్రబాబు పేరు వింటేనే జగన్ రెడ్డి భయపడుతున్నాడు అనడానికి నిదర్శనం. సింగిల్ గా వస్తుందంటు న్న సింహం నేడు నక్కలా కుయుక్తులు.. అబద్ధాలతో ప్రజల్ని నమ్మించే ప్రయ త్నం చేస్తోంది.

17-ఏ కు సంబంధించి తీర్పు వచ్చేవరకు చంద్రబాబు బెయిల్ పై ఎలాంటి విచారణ చేపట్టబోమని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా.. న్యాయస్థానం వ్యాఖ్యల్ని తప్పుపడతారా?
సుప్రీంకోర్టు నేడు చాలా స్పష్టంగా 17- ఏ పై తీర్పు వచ్చేవరకు ఈ కేసు విచారణ చేపట్టలేమని ఏపీ సీఐడీకి తేల్చి చెప్పింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుపై మోపబడిన అభియోగాలకు సంబంధించి 17-ఏ కు సంబంధించిన తీర్పు వచ్చేవరకు చంద్రబాబు బెయిల్ రద్దుకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టబోమని చెప్పింది. అదే సమయంలో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ నిబంధనలపై తాము జోక్యం చేసుకోబోమని దేశ సర్వోన్నత న్యాయస్థా నం చాలా స్పష్టంగా చెప్పింది. బెయిల్ నిబంధనలు రద్దు చేయాలని సీఐడీ కోరడం కూడా తప్పని చెప్పింది. చంద్రబాబు రాజకీయ సభల్లో పాల్గొనవచ్చని, రాజకీయ సమావేశాలు పెట్టవచ్చని, ప్రజల్లో తిరగవచ్చని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.

సుప్రీంకోర్టు నేడు చేసిన వ్యాఖ్యలతో ఎవరికి మొట్టికాయ పడిందనేది జగన్ ప్రభుత్వానికి… అతని నీలిమీడియాకు అర్థమైన ట్టు లేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి ఉభయుల్లో ఎవరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవంగా స్కిల్ డెవలప్ మెంట్ కేసు గురించి పదేపదే మీడియాతో మాట్లాడింది సీఐడీ చీఫ్ సంజయ్.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. జగన్ ప్రభుత్వమే. కేసు గురించి మీడియాతో మాట్లా డవద్దని సుప్రీంకోర్టు జగన్ రెడ్డి ప్రభుత్వానికి..అతని జేబు సంస్థలకు చెబితే.. చంద్రబాబుకి చెప్పినట్టు నీలిమీడియా వక్రకరించింది. చంద్రబాబు ఎప్పుడైనా.. ఎక్కడైనా ఇన్నిరోజుల్లో కేసు గురించి మీడియాతో మాట్లాడారా?

99 శాతం హామీలు అమలు చేశాననే జగన్ రెడ్డి..చంద్రబాబు ప్రజల్లోకి వస్తున్నాడంటే ఎందుకింతలా వణికిపోతున్నాడు?
నేడు..ఇంతకుముందు నీలిమీడియా చేస్తున్న విషప్రచారం ముమ్మాటికీ జగన్ రెడ్డి భయానికి నిదర్శనమే. 99శాతం హామీలు అమలుచేశానని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు ప్రజల్లోకి వస్తుంటే ఎందుకింతలా వణికిపోతున్నాడు? చంద్రబాబు ప్రజాక్షేత్రంలోకి వస్తే తన దోపిడీ..దుర్మార్గాలు.. దౌర్జన్యాలు..దురాగతాలు అన్నీ పూసగుచ్చినట్టు ప్రజలకు వివరించి, తన రాజకీ య జీవితానికి ఘోరీ కడతాడన్న భయంతోనే, జగన్ రెడ్డి నేడు తనచేతిలోని నీలిమీడియా.. కూలి మీడియా సాయంతో ఆఖరికి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని కూడా వక్రీరించే దుస్థితికి దిగజారాడు. మోసకారీ జగన్ రెడ్డి.. అబద్ధాల జగన్ రెడ్డి.. పదే పదే అబద్ధాలతోనే నెగ్గుకురావాలని చూస్తున్నాడు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలు..మోసాలే.. అధికారం చరమాంకానికి వచ్చాక అవే అబద్దాలు..మోసాలతో ప్రజల్ని నమ్మించేందుకు జగన్ రెడ్డి, అతని ప్రభుత్వం కిందామీదా పడుతోంది
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులు.. యువత.. విద్యార్థులు..మహిళలు అన్ని వర్గాల వారికి నోటికొచ్చిందల్లాచెప్పి, అధికారంలోకి వచ్చాక నవరత్నాల పేరుతో నయవంచన చేశాడు. ఇప్పుడు అధికారాంతానికి వచ్చాక కూడా అవే అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని వంచించేందుకు కిందామీదా పడుతున్నాడు. హైకోర్టు చంద్ర బాబుకి రెగ్యులర్ బెయిల్ ఇవ్వగానే ఆఘమేఘాలపై సుప్రీంకోర్టుని ఆశ్రయించిన జగన్ రెడ్డి.. రాయలసీమకు నీళ్లందించే హంద్రీనీవా, గాలేరు-నగరి, మచ్చుమర్రి, తెలుగుగంగ వంటి పథకాలన్నీ బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ పున:సమీక్షతో ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తితే దానిపై తన ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లలేదో జగన్ చెప్పాలి.

రాష్ట్రానికి రావాల్సిన నీటికేటాయింపులపై అసంబద్ధ వాదనలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వ వాదనల్ని కొట్టేయించడానికి సుప్రీంకోర్టు లో ఎలాంటి ప్రయత్నం చేయని జగన్ రెడ్డి నిస్సిగ్గుగా చంద్రబాబు బెయిల్ పై మాత్రం ఎగేసుకొని మరీ దేశ సర్వోన్నత న్యాయస్థానం తలుపుతట్టాడు. ఒక వైపు యువగళ పాదయాత్ర పున:ప్రారంభం..మరోవైపున భువనేశ్వరి నేత్రత్వంలో నిజం గెలవాలి అనే కార్యక్రమం డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ రెడ్డి… అతని జేగ్యాంగ్ లో వణుకుడు మొదలైంది. ఆ రెండు కార్యక్రమాలకు తోడు.. చంద్రబాబు ప్రజల్లోకి రానున్నారని తెలిసే చివరకు సుప్రీం కోర్టు వ్యాఖ్యల్ని కూడా తనకు అనుకూలంగా ప్రచారం చేసుకునే దురవస్థకు జగన్ రెడ్డి వచ్చాడు.

చరమాంకంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని శాశ్వతంగా పాతాళంలోకి నెట్టేందుకు ప్రభాత సూర్యుడిలా చంద్రబాబు త్వరలోనే కదనరంగం లోకి దిగనున్నారు. నువ్వు బలంగా నమ్మే అబద్ధాలు..మోసాలతో ఎల్లకాలం ప్రజల్ని వంచించలేవు జగన్ రెడ్డి? నువ్వూ.. నీ పెద ముత్తైదు సజ్జల ఎన్ని కుట్రలు పన్నినా… తలకిందులుగా తపస్సుచేసినా చంద్రబాబు తప్పుచేశాడని నిరూపించలేరని తెలుసుకోండి. జగన్ రెడ్డి ఆలోచనాధోరణి.. అతని ప్రభుత్వ వైఖరిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు.” అని శ్రీనివాసరెడ్డి ఎద్దేవాచేశారు.

LEAVE A RESPONSE