– కొనుగోలు కేంద్రాల్లో రైతు మరణాలు ప్రభుత్వ హత్యలే
– అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థ మీద లేదు రేవంత్ రెడ్డికి
– ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఈ మరణాలకు బాధ్యులు
– కాంగ్రెస్ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం
– కాంటాలు పెట్టడంలో .. కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం
– ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఉత్త మాటలే
– దళారులు, CCI అధికారులు కలిసి పత్తి రైతులను మోసం చేసి 3500 కోట్ల కుంభకోణం చేశారు
– పెండింగ్ లో ఉన్న 500 కోట్లకు పైగా పంట బోనస్ ను తక్షణం విడుదల చేయాలి
– సిద్దిపేట మార్కెట్ యార్డ్ లో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
సిద్దిపేట: రాష్ట్రంలో ఎక్కడ కూడా ధాన్యం కొనలేదు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూ రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నారు. ధాన్యం కుప్పలపైన ప్రాణాలు కోల్పోతున్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో చెప్పిన రైతుల వివరాలు.
ఏప్రిల్ 15: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం దూలూరు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో జలపతిరెడ్డి అనే రైతు మృతి
ఏప్రిల్ 21: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం ధాన్యం కొనుగోలు కేంద్రంలో హనుమండ్ల ప్రేమలత అనే మహిళా రైతు హఠాన్మరణం.
ఏప్రిల్ 22: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి కొనుగోలు కేంద్రంలో ప్రాణాలు కోల్పోయిన బిర్రు వెంకన్న.
ఏప్రిల్ 26: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు కొనుగోలు కేంద్రంలో ధాన్యం నేర్పుతూ కుప్పకూలి ప్రాణాలు వదిలిన చింతకింది హనుమయ్య.
ధాన్యపు రాశులే సాక్షంగా, కొనుగోలు కేంద్రాల్లోనే జరుగుతున్న ఈ రైతు మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. ఇవి సహజ మరణాలు కావు, ముమ్మాటికీ కాంగ్రెస్ నిర్లక్ష్యంతో జరిగినవే. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఈ మరణాలకు బాధ్యులు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, వారి ప్రాణాల మీదకు తెచ్చింది.
సాగు నీళ్లు అందించడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం, కాంటాలు పెట్టడంలో వైఫల్యం, కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం, బడాయిగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యం. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రైతు మహోత్సవాలు నిర్వహించడం సిగ్గుచేటు.రైతులు ప్రాణులు కోల్పోతుంటే ఏం ముఖం పెట్టుకొని వేడుకలు చేస్తున్నారు?
ఈ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ద, అన్నదాతల ఆవేదనపై లేకపోవడం సిగ్గుచేటు. అందాల పోటీలపై పోటీ పడి సమీక్షలు నిర్వహిస్తున్న నాయకులకు, కొనుగోలు కేంద్రాల్లోనే కుప్పకూలుతున్న రైతున్నల గుండె కోత వినిపించడం లేదా? ఈదురుగాలులు, అకాల వర్షాలతో రైతులు దినదినగండంగా గడుపుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది.
ఒక వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రేవంత్ రెడ్డి దేవుల మీద ఒట్టు పెట్టి మాట తప్పినందుకు, ఇంకెందుకో తెలియదు గానీ ప్రకృతి పగ పట్టినట్టుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గ్రామగ్రామాన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఏ ఒక్క రైతూ నష్టపోకుండా ప్రతి రైతుకూ మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టారు.
పంట కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. ధాన్యం అమ్మిన డబ్బులు 10 రోజులు దాటుతున్నా రైతులకు చెల్లించడం లేదు. ధాన్యం డబ్బులు 48 గంటల్లోనే చెల్లించాలని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఉత్త మాటలే అయ్యాయి.
70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటి వరకు 24.43 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది. దీని విలువ రూ. 5664 కోట్లు. చెల్లించింది రూ. 3163 కోట్లు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వాహకుల అలసత్వం.. ఫలితంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోసి వారాల కొద్దీ వేచి చూసినా కాంటాలు కావడం లేదు. టార్పాలిన్ కవర్లు ఇవ్వకపోవడంతో, అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతున్నది. వివిధ కారణాలు చెప్పి 5కిలోల దాకా తరుగు తీస్తుండటం రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నది.
సరైన కరెంటు ఇవ్వక నీళ్లు ఇవ్వక పంటలు ఎండ కొట్టింది ప్రభుత్వం. రైతులను అన్ని రకాలుగా తిప్పలు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇవ్వలేదు నాణ్యమైన కరెంటు ఇవ్వలేదు నీళ్లు ఇవ్వలేదు పండిన పంటను కూడా కొనడం లేదు. రుణమాఫీ జరిగిన రైతులు వివరాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు ప్రభుత్వం రుణమాఫీ కాని వారి వివరాలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి.
25 శాతం మందికి రుణమాఫీ చేసి పూర్తి రుణమాఫీ జరిగిందని ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. మరికొన్ని చోట్ల దొంగల బెడద రైతన్నకు నిద్ర లేకుండా చేస్తున్నది. ఇంటిని వదిలి, రోజుల తరబడి రైతులు వరి కుప్పలపై టార్ఫాలిన్ కవర్లు కప్పి అక్కడే కాపాల కాస్తున్న పరిస్థితి. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నది. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంలో కొనుగోళ్లు చేపట్టకపోవడం నిరాశలోకి నెడుతురన్నది.
కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి? అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థ మీద లేదు రేవంత్ రెడ్డికి. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మామిడి రైతులు తెలుగు నష్టపోయారు. పత్తి రైతులకు ప్రభుత్వం మోసం చేసింది. CCI అధికారులు కలిసి పత్తి రైతులను మంచి 3500 కోట్ల కుంభకోణం చేశారు.
బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన తర్వాత విజిలెన్స్ ఎంక్వయిరీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం సహా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నా పాలకుల్లో మాత్రం ఎలాంటి చలనం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు.
కాంటాలు పెట్టి కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని వేడుకుంటున్నా కనికరం లేదు.
బోనస్ ఇస్తామని ప్రకటించారు తప్ప ఆచరణ లేదు. బోనస్ పెద్ద బోగస్ అయ్యింది. ఈ సీజన్ ఇప్పటి వరకు 25లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో 10.32 లక్షల టన్నుల సన్నాలు, 14.11 లక్షల టన్నుల దొడ్డు వడ్లు ఉన్నాయి. దీని విలువ 515.82 కోట్లు కాగా, ఇప్పటి వరకు చెల్లించింది సున్నా.
అంటే బోనస్ ను సున్నా చేసారు.భారం తగ్గించుకునేందుకు సన్నాలను కొనుగోలు చేయడం లేదు. 30లక్షల టన్నుల సన్న ధాన్యం వస్తుందని అంచనా వేశారు.
ఫిబ్రవరిలో కట్టాల్సిన రైతు భీమా ఇప్పటివరకు కట్టకపోవడం వల్ల ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో చనిపోయిన రైతులకు రైతు బీమా రాలేదు. పెండింగ్ లో ఉన్న 500 కోట్లకు పైగా పంట బోనస్ ను తక్షణం విడుదల చేయాలి.