Suryaa.co.in

Telangana

చర్చలకు పిలిచి బెదిరిస్తారా?

– ఏ పథకాలు ఆపాలో చెప్పమనడం దుర్మార్గం
– ప్రజలను ఉద్యోగులపై ఉసిగొల్పుతారా?
– సీఎం రేవంత్‌పై టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ ఆగ్రహం

హైదరాబాద్: తమ సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఆవేదన చెంది గత 17 నెలలుగా అనేక సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి తెచ్చినా పరిష్కారం కాని పక్షంలో ..తమ సమస్యలకు పరిష్కారం చూపండి లేకపోతే నిరసన తెలుపుతామని ప్రకటిస్తే, ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించే బదులు వారిని బెదిరించడం సరికాదు.

ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయకుండా ఉద్యోగులకు రావలసిన బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం శోచనీయం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే.. ప్రజలకు ఏమి ఆపాలో చెప్పండి అని ఉద్యోగుల పై ప్రజలను రెచ్చగొట్టి, ఉద్యోగులకు ఇవ్వలిసిన న్యాయమైన డిమాండ్లను ఎగ్గొట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గం.

భారత దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు కరువుభత్యాలు ఇస్తున్నాయి. ఎక్కడ 5 డి ఏ లు పెండింగ్ లో లేవు. ఉద్యోగులకు ఇవ్వడానికి లేని నిధులు.. అందాల పోటీకి, మూసీ ప్రక్షాళనకు, స్కిల్ యూనివర్సిటీకి ఎక్కడినుండి వస్తున్నాయి? తెలంగాణ ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాటం చేసిన ఉద్యోగులను ప్రజలనుండి వేరు చేసే కుట్ర జరుగుతున్నది.

అనేక వర్గాలు తమ సమస్యలను పరిష్కరించడానికి వివిధ రూపాలలో ప్రభుత్వానికి నివేదిస్తే రాజకీయ కుట్ర గా అభివర్ణించడం అన్యాయం. తెలంగాణ ఉద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసె వ్యాఖ్యలను ముఖ్యమంత్రి ఉపసంహారించుకోవాలి. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం వలన జరుగుతున్న పరిణామాల వలన, ఢిల్లీ లో మిమ్ములను కలువడం లేదు. దానికి ఉద్యోగులను బలి చేస్తారా? వెంటనే ఉద్యోగ సంఘాల జాక్ ను చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం

LEAVE A RESPONSE