Suryaa.co.in

Telangana

కెసిఆర్ హయాంలో దేవాలయాలకు పూర్వ వైభవం

యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని, కెసిఆర్ హయాం లోనే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

మంత్రి ఈ రోజు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, చరిత్రలో న భూతో న భవిష్యత్తు అన్న చందంగా సీఎం కేసీఆర్ గారు యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించాలని చెప్పారు. దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. కెసిఆర్ సీఎం గా వచ్చిన తర్వాతే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ గారి కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామి ని కోరుకున్నట్లు మంత్రి చెప్పారు.

LEAVE A RESPONSE