ఫ్రీ టీవీ .. ఖర్చంతా ప్రభుత్వానిదే..

– సామాన్యులకు మరో గుడ్ న్యూస్

సామాన్య ప్రజల అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ సౌకర్యాలను కల్పిస్తోంది. ఇళ్లకు ఉచితంగా ఆహార ధాన్యాలు(రేషన్) ఇవ్వడంతో పాటు.. ఇప్పుడు డిష్ టీవీని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ పెద్ద నిర్ణయం తీసుకుంది.

దేశంలో పబ్లిక్ సెక్టార్ ప్రసారాలను పెంచడానికి సెంట్రల్ స్కీమ్‌కు ఆమోదం తెలుపుతూ.. కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆల్ ఇండియా రేడియో FM ఛానెల్‌ల కవరేజీని 80 శాతానికి పైగా జనాభాకు విస్తరించాలని, 8 లక్షల డీడీ ఉచిత డిష్ డీటీహెచ్‌ను పంపిణీ చేయడానికి ప్రణాళికలను ప్రకటించింది. మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు సెట్-టాప్ బాక్స్‌లు అందించాలని నిర్ణయించారు.

వీటిలో గిరిజన జనాభా ఉన్న ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలతో పాటు సరిహద్. సంబంధించిన తయారీ, సేవల ద్వారా పరోక్ష ఉపాధిని సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. డిడి ఫ్రీ డిష్‌ను విస్తరించడం వల్ల డిటిహెచ్ బాక్సుల తయారీలో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని యోచిస్తోంది.

Leave a Reply