6 నెలల్లో GPS ఆధారిత టోల్‌ వ్యవస్థ

– గడ్కరీ

రాబోయే 6నెలల్లో GPS ఆధారిత టోల్‌ వ్యవస్థ తీసుకొస్తామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ..ప్రస్తుతం ఉన్న టోల్ ప్లాజాల స్థానంలోనే వీటిని ఏర్పాటు చేస్తామని, వీటివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతోపాటు, ప్రయాణించిన దూరానికే ఫీజు వసూలు చేయడం వీలుపడుతుందని చెప్పారు. వాహనం ఆగకుండానే నంబర్‌ ప్లేట్లను రీడ్‌ చేసే ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రవాణాశాఖ పనిచేస్తోందన్నారు.

Leave a Reply