అమరావతి : శాసనమండలి డిప్యూటీ చైర్ పర్సన్గా ఎన్నికైన ఎమ్మెల్సీ జకియా ఖానమ్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఈ రోజు అధ్యక్షా అని సంభోదించే స్థానంలో తన అక్క జకియా ఖానమ్ కూర్చోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి ఒక గృహిణిగా చట్టసభల్లో అడుగుపెట్టడమే కాకుండా డిప్యూటీ వైస్ చైర్మన్గా ఆ స్థానంలో కూర్చోవడం గర్వనీయమన్నారు. ‘నిజంగా మైనార్టీ అక్కచెల్లెమ్మలందరికీ ఇది ఒక సంకేతం. ఒక సందేశం. మహిళలు అన్ని రకాలుగా పైకి రావాలి. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలి. ప్రభుత్వమన్నది తోడుగా ఉండాలన్నది మ ప్రయత్నం ఈ రెండున్నర సంత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా దేవుడు ఈ రోజు నాకు ఈ అదృష్టాన్ని ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను. మీకు మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.