మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో…

ఒక చక్కని సందేశం.

ఒక ముసలి ఆవిడ ప్రతి రోజు గుడి ముందు యాచిస్తూ (బిక్షం అడుగుతూ) ఉండేది .
ఒక రోజు , ఆ గుడిలో నుంచి ఒక సాధువు గారు ఆ ముసలి ఆవిడను ఇలా అడిగారు :- మీరు మంచి కుటుంబానికి చెందినవారు , మీ కొడుకు చాలా మంచివాడు కదా !
మరి మీరు రోజు ఇక్కడ ఎందుకు నిలబడుతున్నారు ?
అప్పుడు ఆ ముసలావిడ ఇలా సమాధానం ఇచ్చింది :- బాబు , మీకు తెలుసు కదా ! నాకు ఉన్నది ఒకే ఒక్క కొడుకు .
నా భర్త చనిపోయి చాలా సంవత్సరాలు అయింది . నా కొడుకు 8 నెలల క్రితం ఉద్యోగం కోసం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు .
వెళ్తూ వెళ్తూ నా ఖర్చుల కోసం కొంత డబ్బు ఇచ్చి వెళ్ళాడు .
ఆ డబ్బు మొత్తం నా అవసరాలకు అయిపోయింది .
నేను కూడా ముసలిదానిని అయిపోయాను . కష్టం చేసి డబ్బు ను సంపాదించలేను .
అందుకే గుడి ముందు ఇలా బిక్షం అడుగుతున్నాను .
అప్పుడు ఆ సాధువు ఇలా అడిగారు :- ” మీ కోసం మీ కొడుకు డబ్బు పంపించడం లేదా ? ”
ఆ ముసలావిడ ఇలా చెప్పింది :- నా కొడుకు ప్రతి నెల నా కోసం ఒక రంగు కాగితం పంపిస్తాడు . నేను ఆ కాగితాన్ని ప్రేమతో ముద్దు పెట్టుకుని నా కొడుకు జ్ఞాపకార్థం ఆ కాగితాన్ని గోడకు అంటిస్తాను .
సాధువు ఆమె ఇంటికి వెళ్లి చూడాలని నిర్ణయించుకుంటారు .
మరుసటి రోజు సాధువు ఆమె ఇంటి లోపల వున్న గోడ ను చూసి ఆశ్చర్యపోతారు .
ఆ గోడకు 8 చెక్ లు అతికించి వుంటాయి .
ఒక్కొక్క చెక్ విలువ ₹50,000 లు .
ఆ ముసలావిడకు చదువు రాదు .
అందుకే ఆమె దగ్గర ఎంత విలువైన సంపద వుందో ఆమెకు తెలియదు అని సాధువు అర్థం చేసుకొని, ఆ ముసలావిడ కు వాటి విలువ గురించి వివరిస్తారు. .

మనం కూడా ఈ కథలో వున్న ముసలావిడ లాంటి వాళ్ళమే .
మనందరి దగ్గర కూడ భగవద్గీత గ్రంథం ఉంది .
కానీ , మనకు భగవద్గీత ఎంత విలువైన సంపదో అర్థం అవ్వలేదు .
మనకు భగవద్గీత విలువ తెలిసి వుంటే మనం దానిని ప్రతి రోజు చదివి భగవద్గీత ప్రకారం జీవితం గడిపి వుండేవాళ్ళం .
మనం కూడా ఆ ముసలావిడ లాగానే భగవద్గీత ను అప్పుడప్పుడు ప్రేమతో ముద్దు పెట్టుకొని మన ఇంట్లో పైన అర్మారాలో భద్రంగా పెడుతున్నాం .
ఈ ప్రపంచం మొత్తం ఒక్క భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు సెల్యూట్ చేస్తుంది. కానీ మనం మన సంసృతి ని విడిచిపెట్టి విదేశీ ముసుగు బారిన పడుతున్నాం
సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్న గ్రంథం భగవద్గీత .

చదవడానికి మరియు వినడానికి ఎంతో అందమైన శృతి మనోహరంగా ఉన్న గ్రంథం భగవద్గీత .
ఈ ఆధునిక సాంకేతిక కాలంలో సైంటిస్టులు కనుక్కుంటున్న ఎన్నో కొత్త కొత్త విషయాలను ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే తెలియజేసిన అద్భుతమైన గ్రంథం భగవద్గీత .
ఎన్నో వ్యాధులకు మందు రామాయణ మహా భారత భగవద్గీత లలో ఉన్నాయి
దేవుడు లేడు అని నమ్మే ఎంతో మంది నాస్తికులను సైతం, గొప్ప గొప్ప దైవ విధేయులుగా మారుస్తున్న గ్రంథం ఈ పవిత్ర భగవద్గీత.

గొప్ప గొప్ప సైంటిస్టులను సైతం హిందువులుగా(దైవ విధేయులుగా) మారుస్తున్న గ్రంథం భగవద్గీత .
ప్రపంచంలో కొన్ని కోట్లమంది హృదయాలలో కంఠస్థం చేయబడిన గ్రంథమ్ భగవద్గీత .
ఈ ప్రపంచంలో ఎల్లప్పుడూ , అత్యధికంగా పఠించబడుతున్న గ్రంథం భగవద్గీత.
ఇంకా ఎన్నో గొప్ప ఘనతలు కలిగివున్న గ్రంథం భగవద్గీత .

Leave a Reply