Suryaa.co.in

Devotional

శాస్త్రవేత్తలకే అర్థంకాని భారతదేశ శివాలయాలు

మహానంది
శివలింగం అడుగునుండి వచ్చే నీటితో కొన్ని వేల ఎకరాల భూమి పంట పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కోనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
– ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య )
కె. అగ్రహారంలోని కాశీ విశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరుని 14 గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
– ఆదిలాబాద్ జిల్లాలోని శ్రీ బుగ్గా రామేశ్వరాలయం. ఈ ఆలయంలో శివ లింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
– కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరము దేవాలయంలో నంది ఉత్తరాయణంలో ఉత్తర ముఖంగాను, దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతుంది. ఇది వండర్
అలంపూర్ బాల బ్రహేశ్వర లింగానికి ఎన్ని నీళ్ల ట్యాం ట్యాంకులతో నైనా అభిషేకం చెయ్యండి. కానీ ఆనీరు ఎటుపోతుందో ఎవ్వరికీ తెలియదు.
– వరంగల్ జిల్లా వెయ్యిస్తంభాల గుడి.
ఇక్కడ సంగీత స్తంభాలు గలవు. ఇక్కడ నందిని మీటితే కంచు శబ్దం వస్తుంది.
– ద్రాక్షారామం శివలింగం.
ఈ శివలింగంపై ఉదయం, సాయత్రం సూర్య కిరణాలు పడతాయి.
– భీమవరంలో సోమేశ్వరుడు.
ఇక్కడ శివలింగం అమావాస్యకు నల్లగా, పౌర్ణమికి తెల్లగా రంగులు మారతాయి.
– కోటప్పకొండ
ఎటుచూసినా 3 శిఖరాలు కనిపిస్తాయి. ఇక్కడికి కాకులు అసలు రావు
– గుంటూరు జిల్లా చేజర్ల
ఇక్కడ స్వామిపేరు కపోతేశ్వర స్వామి. లింగానికి దక్షిణ భాగంలో ఉన్న రంధ్రంలో నీళ్లు పోస్తే శవం కుళ్లినవాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరుపోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలీదు.
– బైరవకొన
ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరురాదు.
– యాగంటి
ఇక్కడ రోజురోజుకు నంది పెరుగుతూ ఉంటుంది
శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయము వెనుక ఒకప్పుడు “జుం”తుమ్మెద శబ్దం వినపడేదట.
– కర్నూలు జిల్లాసంగమేశ్వరం లో వేపచెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది.6నెలలు ఈదేవలయం నీటిలో మునిగి ఉంటుంది. 6నెలలు బయటకు కనిపిస్తుంది.
– శ్రీకాళహస్తిలో వాయురూపములో శివలింగం ఉంటుంది.
– అమర్ నాధ్ శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది.
– కర్ణాటకలోని శివగంగ
ఇక్కడ శివలింగంపై నెయ్యివుంచితే వెన్న అవుతుంది.ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు.
– మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది.
– కంచి
ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు.
– తమిళనాడు తిరునాగేశ్వరం
ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి.
– చైనాలో కిన్నెర కైలాసము
ఇక్కడ ఉన్న శివలింగము ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతుంది.

– భావన్నారాయణ

LEAVE A RESPONSE