ప్రెస్ క్ల‌బ్ లో స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు

హైద‌రాబాద్, ఆగ‌స్ట్ 15, : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో 76 వ స్వాతంత్య్ర దినోత్సవ, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవ’ వేడుక‌లు సోమవారం ఘ‌నంగా నిర్వ‌హించారు. క్ల‌బ్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ మెంబ‌ర్ ఎం.ఏ. ర‌హిమ్ తో క‌లిసి ప్రెస్ క్ల‌బ్ క‌మిటీ అధ్య‌క్షుడు ఎల్. వేణుగోపాల నాయుడ‌ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ప్రెస్ క్ల‌బ్ క‌మిటీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్. ర‌వికాంత్ రెడ్డి, ఉపాధ్య‌క్షురాలు సి. వ‌న‌జ‌, జాయింట్ సెక్ర‌ట‌రీ సి. హ‌రిప్ర‌సాద్, కోశాధికారి ఏ. రాజేష్, స‌భ్యులు బ్ర‌హ్మండ‌భేరి గోప‌రాజు, వి. బాపురావు, టి. శ్రీనివాస్, ఎం. రాఘ‌వేంద్ర‌రెడ్డి ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్రం రావ‌డ‌నాకి కృషి చేసిన త్యాగ‌ధ‌నుల సేవ‌ల‌ను క‌మిటీ స‌భ్యులు గుర్తు చేసుకున్నారు. పాల‌క‌మండ‌లితో పాటు సీనియ‌ర్ స‌భ్యులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Leave a Reply