Suryaa.co.in

National

సింధు జలాల ఒప్పందం నిలిపివేత

– వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే పాక్ ఆధారం
– భారత్ నిర్ణయంతో పాక్ ఇక ఎడారే
– పాకిస్థాన్ కు భారత్ బిగ్ షాక్

ఇప్పటికే కటిక కష్టాలు, రుణభారం, ఆకలితో అలమటిస్తున్న పాక్‌పై భారత్ సంధించిన జల అస్త్రం పాక్‌ను మరిన్ని కష్టాల్లోకి నెట్టనుంది. దానికి కారణం భారత్ ఆ దేశానికి సింధు జలా లు నిలిపేయడమే.

భారత్, పాక్ మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. ఈ మేరకు సింధు, చీనాబ్, జీలం నదుల నీటిని పాక్ ఉపయోగించుకునే అవకాశముంది. వ్యవసాయం, గృహావసరాలకు ఈ నదులపైనే ఆ దేశం ఆధారపడుతోంది. భారత్ తాజాగా ఆ ఒప్పందాన్ని నిలిపేయడంతో పాక్ లో ని చాలా ప్రాంతాలు ఎడారిలా మారే ఆస్కారముంది. సింధుకు ఉపనదులైన చీనాబ్ 1 జీలం నదులు భారత్ పాక్ పుట్టగా, చైనాలో జన్మించిన సింధు.. భారత్ నుంచి పాక్ లోకి ప్రవహిస్తుంది.

1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం.. సింధు, దాని ఉపనదులైన జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి. పాకిస్థాన్‌లోని కోట్ల మంది ప్రజలకు ఈ నదులే ప్రధాన నీటి వనరు.

1960 సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్థాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1965, 1971, 1999 యుద్ధాల సమయంలోనూ నిలిచిన ఈ చారిత్రక ఒప్పందాన్ని భారత్ ఇప్పుడు నిలిపివేసింది. భారత్ తన నిర్ణయాన్ని ఎప్పుడైనా మార్చుకునే అధికారం ఉండటంతో, ఇకపై పాక్ ప్రజలకు సాగు-తాగు నీటి కష్టాలు తప్పవు. ఇప్పటికే కటిక దరిద్రంలో ఉన్న పాక్ ప్రజలకు భారత్ తీసుకున్న ఈ నిర్ణయం మరిన్ని కష్టాలు తీసుకురాక తప్పదు.

LEAVE A RESPONSE