– వంశీ ఒక దుర్మార్గుడు, నికృష్టుడు
– ఒక క్రిమినల్ను జైలుకెళ్లి కలుస్తావా?
– దళితులను ఊచకోత కోసిన వంశీని జైలుకు వెళ్లి పరామర్శిస్తావా?
– ముద్దాయిలన్నా, జైలన్నా జగన్ కు ఎందుకంత ప్రేమ?
– రామకృష్ణారెడ్డి, విజయపాల్, బోరుగడ్డ అనిల్ లాంటివారిని జగన్ ఎందుకు పరామర్శించలేదు?
– మహిళలు, దళితులకు నువ్విచ్చే సందేశం ఏమిటి?
– నీ పులివెందులలో దళితురాలిపై దాడి జరిగితే ఎందుకు వెళ్లలేదు?
– వైసీపీ అధినేత జగన్పై టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫైర్
మంగళగిరి: దుర్మార్గుడు, నికృష్టుడు, దళితులను ఊచకోత కోసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించేందుకు వెళుతున్న జగన్.. నీకు సిగ్గుందా? అలాటి క్రిమినల్స్ను పరామర్శించడం ద్వారా మహిళలు, దళితులకు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావో చెప్పు. కనీసం వెళ్లడానికయినా సిగ్గుండాలి.అనేక కేసుల్లో ముద్దాయి, అసాంఘిక శక్తిగా పేరుగాంచి, దళితులను ఊచకోత కోసి, మహిళల వ్యక్తిత్వ హననం చేసిన ‘‘వంశీ’’ని జైల్లో పరామర్శకు జగన్ వెళ్లడం అభ్యంతరకరం, విడ్డూరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.
జగన్ ఐదేళ్ల పాలన అరాచక, అప్రజాస్వామిక, దౌర్జన్యపూరిత, రాక్షస పాలన. ముద్దాయి వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్ పడుతున్న తపన, చూపిస్తున్న ప్రేమ వెనుక మతలబేంటో? అర్థం కావడంలేదు. వంశీ అన్నెం, పున్నెం ఎరగడు, నిజాయితీపరుడు, సచ్చీలుడు, చీమకుకూడా హాని తలపెట్టడు, పరస్త్రీలను, దళితులను గౌరవిస్తాడు, భూ కబ్జాలు చేయడు, దొంగ పట్టాలు సృష్టించడు, పట్టిసీమ మట్టి కొట్టేయడు, దళితులను హింసించడు, అత్యంత నిజాయితీపరుడు అనే భావన జగన్ లో ఉన్నట్లుంది.
పట్టిసీమ గట్టు మట్టిని కొల్లగొట్టిన వంశీని పరామర్శించేందుకు వెళ్లడానికి ఎవరైనా ఆలోచించాలి. జగన్ పట్ల దళితులు ఆగ్రహావేశాలతో ఉన్నారనే విషయం జగన్ మరచిపోరాదు. పులివెందులకు చెందిన నాగమ్మ అనే దళితురాలు అత్యాచారానికి గురైతే పరామర్శకు వెళ్లని జగన్.. దుర్మార్గుడు, నికృష్టుడు వంశీని పరామర్శించడానికి వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది.
అత్యాచారానికి గురైన నాగమ్మ పరామర్శకు వెళ్లిన ప్రస్తుత హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే ఎంఎస్ రాజులపై ఎస్సీ, ఎస్టీ యాక్టు పెట్టించింది జగన్ గాదా? దళిత రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ విజయపాల్.. జగన్ కోసం అరెస్టు అయితే ఆయనను పలకరించడానికి వెళ్లలేదెందుకు? బోరుగడ్డ అనిల్ అనే దళితుడిని పరమార్శించడానికి వెళ్లకపోవడానికి కారణం అతను దళితుడనా?
సొంత తల్లిని ఏడించినవాడివి, చెల్లిని తరిమికొట్టినవాడివి, బాబాయి కూతుర్ని మండుటెండలో పరార్ చేసిన వ్యక్తి జగన్.. ఎన్నడూ వారి గురించి ఆలోచించని జగన్ ఇప్పుడు తగుదునమ్మా అని వంశీ ని పరామర్శించడం రాష్ట్ర మహిళల్ని కించపరచడమే.
మహిళలను మానసిక క్షోభ పెట్టిన వంశీని పరామర్శించడానికి జగన్ వెళ్లడం సిగ్గుచేటు. మహిళల పట్ల గౌరవం, ప్రేమ ఉండవు కానీ.. భూకబ్జాదారులు, దుర్మార్గులు, అరాచక, అసాంఘిక శక్తులపట్ల గౌరవం, ప్రేమ జగన్ కు జాస్తి. ఏ తప్పు చేయని వాడిని పరామర్శించడంలో తప్పులేదుగానీ… తప్పుల మీద తప్పులు చేసినవాడిని పరామర్శించడం పెద్ద తప్పు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లుగా తాను పరామర్శలకు వెళ్తాను, నన్నెవరు ఆపడానికంటే అది జగన్ ఇష్టం. ముద్దాయిలన్నా, జైలన్నా జగన్ కు ఎందుకంత ప్రేమ?
నెల్లూరు జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, విజయపాల్, బోరుగడ్డ అనిల్ లాంటివారిని జగన్ ఎందుకు పరామర్శించలేదు?
జగన్ రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించడం దురదృష్టకరం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక కరుడు కట్టిన అసాంఘిక వాది, అసాంఘిక శక్తి, భూ కబ్జాదారుడు, దళిత వర్గాల మీద దాడి చేసే వ్యక్తి, మహిళలు అంటే అతనికి ఏమాత్రం గౌరవం లేదు. అతనిపై అనేక కేసులున్నాయి. అలాంటి వ్యక్తిని జగన్ పరామర్శించడమేంటి? ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేసి, హింసించి అంతకు ముందు పోలీసులకు ఇచ్చిన సాక్ష్యాన్ని వక్రీకరించి కోర్టులో సాక్ష్యం ఇచ్చేటట్లుగా చేసిన తప్పుడు వ్యక్తి వల్లభనేని వంశీ. దళితుడిని బలవంతం చేసిన దౌర్భాగ్యున్ని, దుర్మార్గుడిని పోలీసులు అరెస్టు చేస్తే.. విజయవాడ డిస్ట్రిక్ట్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే.. జగన్ పరామర్శకు వెళ్లడంలో అర్థంలేదు.
జగన్ మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీచ, నికృష్ట సంఘ వ్యతిరేకి అయిన వంశీ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే గా అతను సాగించిన అసాంఘిక కార్యక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు అన్నీ ఇన్నీ కావు. వీటన్నిటిని కూడా పోలీసులు కేసులు రిజిస్టర్ చేసి అరెస్టు చేశారు. అతన్ని పరామర్శించడానికి జగన్ జైలుకెళ్లడమేంటి?
నేను వస్తున్నాను నీకేం పర్వాలేదు అని అన్నట్లుగా ఉంది జగన్ వాలకం. ఏంటి దొంగలు దొంగలు సానుభూతి తెలియజేసుకుంటున్నారని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. మేమంతా ఒకటేనయ్యా మీకు అర్థం కాదు అని జగన్ మోహన్ రెడ్డి అన్నట్లుగా ఉంది. ముద్దాయిలు అంటే ఎందుకు జగన్ కు అంత ప్రేమ, వల్లమాలిన ప్రేమ చూపిస్తారు. జగన్ ముద్దాయిలను బాగా అభిమానిస్తారు. జైల్లో ఉన్న చాలా మంది ముద్దాయిలు కూడా ‘‘మా జగన్, మా జగన్’’ అంటారట ఎందుకో మరి? జైల్లో ఏమైనా వకాల్తా తీసుకున్నారా?
16 నెలలు చంచల్ గూడ జైల్లో ముద్దాయిగా ఉన్నప్పుడు వాళ్ళతో పెరిగిన అనుబంధం కాబోలు… వంశీ అన్యం పుణ్యం ఎరగడని, నిజాయితీపరుడని నిరూపించగలరా? దొంగ పట్టాలు పంచిన ఘనత వంశీది. పట్టిసీమ మట్టి కొట్టేయలేదని నిరూపించగలరా? వంశీ ఒక నీచుడని రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలలు అయిన తర్వాత అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేశారే, ముందే చేయాల్సింది అని అందరూ అడుగుతున్నారు. ఎందుకు ఇంత ఆలస్యం అయిందని ప్రశ్నిస్తున్నారు.
దళితుడిని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి కొడితే వాడిని పరామర్శించడానికి మీరు వెళ్తారా? ఏ పార్టీ దళితుల పట్ల ప్రేమ మీకు అతని మీద ప్రేమ దళితుడిని కొట్టినందుకు అతన్ని అభినందించడానికి వెళ్తున్నారా? జగన్ వ్యవహార శైలిని చూసి అన్ని వర్గాలు ఈసడించుకుంటున్నాయి. చీకొడుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని పలకరించడానికి సిద్ధమవుతారా? ఇది ఎక్కడి న్యాయం? జగన్ మోహన్ రెడ్డి! ముఖ్యమంత్రిత్వంలో సారా రేట్లు విపరీతంగా పెంచాడని ఒక బూతు మాట అంటే ఓం ప్రతాప్ ని చంపేశారు. అతని ఫోన్ ఇప్పటికి ఇవ్వలేదు. ఓం ప్రతాప్ ఇప్పటికి కూడా వారి టెలిఫోన్ సెల్ ఫోన్ ఎక్కడ ఉందో తెలియదు.
జగన్ జాతకం ఎవరికి తెలియనిదికాదు? మీ వ్యవహార శైలి మాకు తెలియదా? దళితులను మీరు ఏ మాత్రం ప్రేమిస్తారో మాకు తెలియదా? నాయకుడిగా ఐదేళ్ల ముఖ్యమంత్రి గా పనిచేసే వ్యక్తిగా ఇలా వెళ్ళటం ఒక ముద్దాయిని పలకరించడానికి వెళ్లడం తన ప్రిస్టేజిని దిగజార్చుకోవడమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.