Suryaa.co.in

Editorial

ఓడినా వీడని జగన్ అహంకారం!

– సీనియర్లను నిలబెట్టిన జగన్
– సమీక్షలో జగన్ నియంతృత్వం
– భేటీ ముగిసేంతవరకూ నిలబడే ఉన్న బీసీ, ఎస్సీ నేతలు
– సీనియర్లకు మరోసారి అవమానం
( మార్తి సుబ్రహ్మణ్యం)

అహంకారం.. నియంతృత్వం.. పైశాచిక ఆనందానికి నిలువెత్తు నిదర్శనమైన వైసీపీ అధినేత జగన్‌కు, అధికారం పోయినా అహంకారం ఇంకా తగ్గినట్లు లేదు. ఓటమి తర్వాత తన 10 మంది ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. దానికి ఎమ్మెల్యేలతోపాటు, మాజీ మంత్రులు-సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.

అంతవరకూ బాగానే ఉంది. కానీ జగన్ నిర్వహించిన సమావేశానికి హాజరైన సీనియర్లు, ఆయనకంటే వయసులో పెద్దవారికి సైతం జగన్ కనీస మర్యాద ఇవ్వలేదు. ముందున్న కుర్చీల్లో కొంతమంది కూర్చుంటే.. సీనియర్లంతా సమావేశం ముగిసే వరకూ నిలబడే ఉన్న దృశ్యాలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. వారిలో ఎక్కువమంది ఎస్సీ-బీసీలే ఉండటం ప్రస్తావనార్హం.

కనీసం వారికి కుర్చీ కూడా ఏర్పాటు చేయకుండా, నిలబెట్టే మాట్లాడటం చూస్తే.. జగన్ తాను ఇంకా సీఎం అనే అహంకారపు భ్రమల్లో మునిగినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

చింతచచ్చినా ఇంకా జగన్‌కు పులుపు చావలేదని అర్ధమవుతోంది. జగన్‌లో ఇంకా అహంకారం తగ్గలేదు. ఈ బలుపుతోనే ఓడిపోయాడు… పెద్దలను గౌరవించడం కూడా తెలియని కుసంస్కారి పార్టీలో కొనసాగగం వారికే సిగ్గుచేటు.. అసలు అలాంటి నియంత ముందు చేతులు కట్టుకుని నిలబడేందుకు సిగ్గుండాలి. ముందు ఎదుటివారికి గౌరవించడం నేర్చుకో.. నా ఎస్సీలు, నా బీసీలనే జగన్ అసలు స్వరూపం ఇదే… బీసీలు, ఎస్సీలను నిలబెట్టిన నీ కండకావరం ఇంకా తగ్గలేదు.. జనం బండకేసి కొట్టినా జగన్‌లో నియంత లక్షణాలు ఇంకా పోలేదంటూ, నెటిజన్లు తెగ విమర్శలు కురిపిస్తున్నారు. పాపం జగన్ టైమ్ బాగోలేదు. ఏం చేస్తాం?

LEAVE A RESPONSE