దళితులపై జగన్ ప్రభుత్వ రాజ్యహింస

యువనేత నారా లోకేష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు

ప్రొద్దుటూరు నియోజకవర్గం నరసింహాపురంలో ఎంఆర్ పిఎస్ ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దళితుల్లో అనేక ఉపకులాలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందక వెనుకబడి ఉన్నారు.మాదిగలతోపాటు ఉపకులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి వర్గీకరణే ఏకైక మార్గం.

2000 నుంచి 2004వరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం వర్గీకరణ అమలుచేయడం వల్ల 24వేలకు పైగా ఉద్యోగావకాశాలు లభించాయి.ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపి, పార్లమెంటులో బిల్లు పెట్టించేందుకు చొరవచూపాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
రాష్ట్రంలో గత నాలుగేళ్లలో రూ.28,147 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి.తమకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన దళితులను జగన్ ప్రభుత్వం రాజ్యహింసకు పాల్పడుతోంది.టిడిపి అధికారంలోకి వచ్చాక మాదిగ, ఉపకులాలకు న్యాయం జరిగేలా దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం. వర్గీకరణ విషయంలో మాదిగల సామాజిక న్యాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది.

Leave a Reply