Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రాన్ని దోపిడీ చేసిన జగన్

-టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్ధాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదు.కమీషన్ల కోసం జలయజ్నాన్ని ధన యజ్నంగా మార్చారు.పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే.

ఒక్క రోజులో 35 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.జగన్ ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని రాచపీనుగులా పీక్కు తిన్నాడు.రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకుని ప్రాజెక్టును గోదాట్లో ముంచారు.

పోలవరం పూర్తైతే 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరందేది.23 లక్షల ఎకరాల ఆయకట్టు స్దిరీకరణ అయ్యేది.ఉత్తరాంధ్ర 4 జిల్లాల్లో 48 మండలాలు, 548 గ్రామాలకు తాగునీరు అందేది.

విశాఖ పారిశ్రామికి హబ్ గా ఎదిగేది. పొరుగు రాష్ట్రాలు, చత్తీష్ గడ్, ఒడిషా కూడా నీళ్లిచ్చేవాళ్లం. ఉత్తరాంధ్రను అభివృద్ది చేస్తానని జగన్ రూ. 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నాడు. ఇదేనా మీరు చేసిన ఉత్తరాంధ్ర అభివృద్ధి? పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబే.

LEAVE A RESPONSE