రాజకీయ కక్ష సాధింపు కోసం పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు జగన్ రెడ్డి. కొంతమంది పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ ని గాలికొదిలి జగన్ పీనల్ కోడ్ అమలు చెయ్యడమే పనిగా పెట్టుకున్నారు. వైసిపి పాలనలో పోలీసు వ్యవస్థ ఎంతగా దుర్వినియోగం అవుతుందో చెప్పడానికి ప్రొద్దుటూరులో జరిగిన సంఘటన ఉదాహరణ. టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటి పై వైసిపి రౌడీ మూకలు దాడి చేసి రాళ్లు రువ్వారు. ప్రవీణ్ ఇంటి పై దాడి జరుగుతుందనే సమాచారం ఉన్నా అడ్డుకోని పోలీసులు రివర్స్ లో ప్రవీణ్ రెడ్డి పై అక్రమ కేసు బనాయించి అర్థరాత్రి అరెస్ట్ చేసారు. జగన్ రెడ్డి భాషలో రివర్స్ పోలీసింగ్ అంటే ఇదేనేమో! ప్రొద్దుటూరులో టిడిపి ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇతర టిడిపి నాయకుల అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే ప్రవీణ్ ని, టిడిపి నాయకుల్ని విడుదల చెయ్యాలి. ప్రవీణ్ ఇంటి పై దాడి చేసిన వైసిపి రౌడీ మూకల పై కేసులు పెట్టి అరెస్ట్ చెయ్యాలి.
Devotional
హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?
హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం! ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు. శాస్త్రంలో హనుమకు…
గుడిలో ప్రదక్షిణ ఎందుకు చేస్తారు?
గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్థంభ దర్శనం చేసుకున్న తరువాత లోనున్న దైవదర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారంలోపల ప్రదక్షిణం చెయ్యడం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చేయాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు?? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు, బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం…
Sports
చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్
భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం…
అండర్ 19 రాష్ట్ర జట్టుకు ఎంపికైన సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన టి. వరుణ్ సాత్విక్, ఎన్. రాజేష్ లు ఆంధ్ర రాష్ట్ర అండర్ 19 మల్టీ డేస్ క్రికెట్ జట్టుకు ఎంపికయ్యారు. ఈరోజు జగ్గయ్యపేట జీ.వీ.జే బాయ్స్ హైస్కూల్లో గల బివి సాగర్ మెమోరియల్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో నెట్స్ వద్దకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య వెళ్లి వారిని అభినందించారు….