ఏపీకి మళ్లీ జగనే సిఎం

– ఎంపి విజయసాయిరెడ్డి

ఆంద్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మళ్లీ జగన్ మోహన్ రెడ్డి కానున్నారని జాతీయ మీడియా సర్వేలు వెల్లడించాయని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మెరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పలు అంశాలపై స్పందించారు. తిరుగులేని ప్రజాదరణ కలిగిన సీఎం జగన్ కు రాబోయే ఎన్నికల్లో నూ ప్రజలు పట్టం కడతారని వరుస సర్వేలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో జగన్ అత్యధిక సీట్లతో ప్రభంజనం సృష్టిస్తారని జాతీయ మీడియా సంస్థలు టైమ్స్ నౌ, ఇండియా టుడే నిర్వహించిన సర్వేలు స్పష్టం చేసాయని చెప్పారు.

రాష్ట్రంలోని 25పార్లమెంట్ స్థానాలకు గాను వైఎస్ఆర్ సిపి 17 నుండి 23 లోక్ సభ స్ధానాలు గెలుచుకుంటందని టైమ్స్ నౌ , ఇండియా టుడే 18 స్థానాలు,ఇండియా టివి 19 స్థానాలు గెలుస్తుందని ఆయా సర్వేలలో వెల్లడించినట్టు ఆయన చెప్పారు.

వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టోనే కరదీపికగా సమన్యాయం, సమగ్రత, సమానత్వం ధ్యేయంగా సీఎం జగన్ పాలన అందిస్తున్నారని ఆయన తెలిపారు. జగన్ ప్రభుత్వం వివిధ వర్గాలకు అందిస్తున్న పథకాలను ఉచితాలుగా చూడటం సరికాదనన్న ఆయన ప్రజల భవిష్యత్తు కోసం పెడుతున్న పెట్టుబడిగా చూడాలని చెప్పారు.

Leave a Reply