Suryaa.co.in

Telangana

కాంగ్రెస్ హయాంలోనే ఉద్యోగాల జాతర

– హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమింపబడుతున్న లెక్చరర్స్, టీచర్స్ కానిస్టేబుల్స్, మెడికల్ సిబ్బందికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుంది.ప్రతి వారం ఎదో ఒక నియామక పత్రాలు ఇస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం.

గతంలో రిప్రజేంటేషన్ ఇవ్వడానికి కూడా సమయం ఇవ్వని గత పాలకులు నేడు ఉద్యోగాల జాతరను చూసి ఓర్వలేక ప్రతి రోజూ ఏదో ఒక విమర్శలు చేస్తున్నారు. ఎన్ని దూషణలు చేసిన నిబద్దత సంకల్ప బలం తో ఇచ్చిన ప్రతి హామీ ని తూ.చ తప్పకుండా అమలు చేస్తాం.

మీ విమర్శలు మాకు అడ్డంకి కానే కావు. మీ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉండవచ్చు వేల మందితో సోషల్ మీడియా నిర్వహిస్తు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చేసి చూపించాము. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయకుండా యూనివర్సిటీలో ఉన్న నిరుద్యోగుల ఆశలు అడియాసలు చేశారు.

మా ప్రభుత్వం 3 నెలల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం.రాష్ట్రంలో చదువుకున్న ప్రతి బిడ్డ ఉద్యోగం పొందాలి. ఆ ఉద్యోగం ద్వారా కుటుంబం ద్వారా సమాజం బాగుపడాలి.

నోటిఫికేషన్ తో పాటు వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ లు ఒకే గదిలో పది మంది ఉంటున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నడి బొడ్డున జ్యోతి రావు ఫూలే ప్రజా భవన్ నుంచి రూపాయి ఖర్చు లేకుండా పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించాం.

రాష్ట్రం నుంచే కాదు దేశంలోనే అత్యుత్తమైన సబ్జెక్టు ఎక్స్ పర్ట్స్ తో పాఠాలు చెప్పించనున్నాం.119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆన్ లైన్ లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము.

సోదరులారా ఇది మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. నిష్టా గరిష్టత తో పని చేస్తాం. చేసే క్రమంలో ఏలాంటి ఆర్ధిక ఇబ్బందులు వచ్చిన ఎదుర్కొంటాము. బాగా చదువుకుని ఉద్యోగాలు పొందిన వారికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు.

LEAVE A RESPONSE