Suryaa.co.in

Telangana

జర్నలిస్టులకు మేలు జరిగేది టీయూడబ్ల్యూజే తోనే

– యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ

మల్కాజిగిరి : జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడి, వారి సంక్షేమం కోసం నిస్వార్థంగా పోరాడే శక్తి కేవలం తమ సంఘానికే ఉందని, గత 65 యేండ్ల నుండి జర్నలిస్టులకు మేలు చేస్తుండడం వల్లే ఈ సంఘాన్ని విశ్వసిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే-ఐజేయు) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ స్పష్టం చేశారు.

శనివారం మల్కాజ్ గిరిలోని పద్మావతి ఫంక్షన్ హాలులో, టీయూడబ్ల్యూజే-ఐజేయు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాల్ రాజ్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ జర్నలిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు పొందుతున్న సౌకర్యాలన్నీ ఉమ్మడి రాష్ట్రంలో తమ సంఘం సాధించినవేనని, గత పదేళ్ల కాలంలో జర్నలిస్టులకు ఆశించిన ప్రయోజనాలేమి లేవని విరాహత్ విచారం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE