Suryaa.co.in

Devotional

మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంత ఊరు

-శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే
-3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు
-“తిరు ఉత్తర కోసమాంగై” శివాలయదర్శనం

తమిళనాడులోని ఒక కుగ్రామం, రామే శ్వరం నుండి సుమారు 75 kms. దూరంలో ఉంది “తిరు ఉత్తర కోసమాంగై”. మధురై వెళ్లే దార్లో వస్తుం ది ఈ ప్రదేశం. ఊరిపేరు పలకడం కొంచెం కష్టమే. మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంత ఊరు ఉంది.

శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి “నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్త గా ప్రసాదించు ఈశ్వరా!” అని వేడుకుంటే తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు.

ఏ దేవాలయంలో కూడా పూజకుపయో గించని మొగలిపువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్క డ శివుడు శివలింగరూపంలో, మరకతరూపంలో, స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజరూపం లో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడిం ది. ఇది అత్యంత విశిష్టమైంది.

ఆ మరకతం నుండి వచ్చే Vibrations ను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివారిని ఎప్పుడూ విభూది, గంధపు పూతతో ఉంచుతారు. కేవ లం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. అలాగే ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటిక లింగానికి అభిషేకం చేసి తర్వాత Locker లో భద్రపరుస్తారు.

20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అ త్యంతప్రాచీనమైన ఈ శివాలయదర్శనం మన పూర్వజన్మసుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహిరూపంలో వెలిశారు. భక్తులు పసుపుకొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ము ద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా రామేశ్వరం యాత్ర కెళ్తే తప్పక ఈ దేవాలయ దర్శనం చేసుకోండి.

– కెర్లెపల్లి బాలసుబ్రమణ్యం
పుంగనూరు

LEAVE A RESPONSE