Suryaa.co.in

Telangana

కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా వృక్షార్చనలో వెయ్యి మొక్కలు నాటిన కడియం నర్సరీ రైతులు

– ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్

రాజమహేంద్రవరం: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి రైతుబంధు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు వృక్షార్చన లో భాగంగా రాజమహేంద్రవరం లోని కడియం నర్సరీల రైతుల ఆద్వర్యంలో వెయ్యి మొక్కలు నాటి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రైతులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రైతు బంధువు, హరిత ప్రేమికుడు అయిన కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కడియం నర్సరీ రైతు పాలూరి నాని ఆధ్వర్యంలో 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అని రైతు బంధువు అయిన కేసిఆర్ గారి పై రైతులు చూపించిన ప్రేమ చాలా అభినందనీయమని అన్నారు.

ప్రాంతాలుగా విడిపోయిన కూడా ప్రజలుగా కలిసిమెలిసి ఉందామని ఉద్యమ సమయం నుండి కేసీఆర్ చెప్పేవారని ఇప్పుడు అదే విధంగా ఇక్కడి వాతావరణం చూస్తుంటే గుర్తుకు వస్తుందని అన్నారు.

కెసిఆర్ 10 సంవత్సరాల తమ ప్రభుత్వం లో హరితహారం కార్యక్రమం ద్వారా పచ్చదనం పెంచడం కోసం 280 కోట్ల మొక్కలను నాటడం జరిగిందని. దానివల్ల తెలంగాణ వ్యాప్తంగా 8.3% పచ్చదనం పెరిగిందని అన్నారు.

రైతులతో మాట్లాడినప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో హరితహారం కార్యక్రమంలో మా అందరికీ ఎంతో ఉపాధి లభించిందని మా నర్సరీల నుండి తెలంగాణ ప్రభుత్వం మొక్కలను కొనుగోలు చేయడం వల్ల మా వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందిందని వారు కేసిఆర్ రైతు బంధువు అని వారు అన్నారు. రైతులు ఎంతో ప్రేమతో మొక్కలు నాటి కేసీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినారు అని. రైతులందరికీ కేసీఆర్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సంతోష్ అన్నారు.

LEAVE A RESPONSE