“అయ్యన్నపాత్రుడిది మనిషి జన్మే నా?

సర్వేపల్లి వై.యస్.ఆర్.కాంగ్రెస్ శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకోవడం సరికాదు. అయ్యన్నపాత్రుడు లాంటి వెధవల వల్లే తెలుగుదేశం పార్టీ మట్టిలో కలిసిపోయింది.మంత్రులను, అధికారులను ఉద్దేశించి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. అయ్యన్నపాత్రుడు లాంటి దిగజారుడు వ్యక్తుల ప్రవర్తనల వల్ల సమాజం సిగ్గు పడుతుంది.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని దూషించినందువల్ల అయ్యన్న పాత్రుడి స్థాయి దిగజారిందే తప్ప, ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలగదు. అయ్యన్నపాత్రుడు లాంటి వెధవలను నడిరోడ్డు మీద తరిమి,తరిమి కొట్టే పరిస్థితి ఉన్నా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయం పాటిస్తూ, అలాంటి చర్యలకు పాల్పడటం లేదు.
చంద్రబాబు ప్రోద్బలంతోనే అయ్యన్న పిచ్చి ప్రేలాపనలు మొదలుపెట్టాడు. చంద్రబాబు ముందు నిరసన తెలపడానికి వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లితే, వారిపై తెలుగుదేశం గూండాలు దాడి చేయడం దుర్మార్గం. చంద్రబాబు తన చుట్టూ గూండాలను పెట్టుకొని, విద్వేషాలు రెచ్చగొట్టి, దాడులకు ఉసిగొల్పుతున్నాడు.వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు మానుకోకపోతే, మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబును, లోకేష్ ను, అయ్యన్న లాంటి నేల టికెట్ గాళ్లను నోరు అదుపులో పెట్టుకోమని ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలని

Leave a Reply