– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: తెల్ల బంగారం తెల్లబోతున్నది బోనస్ దేవుడెరుగు.. మద్దతు ధరకే దిక్కులేదు.పత్తి రైతు దళారుల చేతిలో చిత్తవుతున్నాడు.సీసీఐ కొర్రీలు పెట్టి..సాకులు చూపెట్టి కొనుగోళ్లు నిలిపేసింది. రైతన్న ఆగమైతుంటే..పట్టించుకోవాల్సిన ప్రభుత్వం పత్తా లేదు.
క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని రైతు డిక్లరేషన్లో చెప్పి..ఇప్పుడు ఉలుకూ పలుకూ లేకుండా కూర్చున్నది కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రంలో వరి తర్వాత రెండో అతిపెద్ద పంట పత్తి.. కీలకమైన కాటన్ కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చొరవ లేదు..శ్రద్ధలేదు..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న బుద్ధిలేదు.
ఇప్పటికే..దొడ్డు వడ్లకు బోనస్ ఎగ్గొట్టి దగా చేసారు..సన్నాలకు షరతులు పెట్టి కొర్రీలు వేస్తున్నారు..పత్తి రైతును కూడా చిత్తు చేస్తున్నారు. కర్షక ద్రోహి కాంగ్రెస్..రైతు డిక్లరేషన్ బోగస్.