– బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల నిర్వహణపై చర్చ
హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నిర్వహణ నేపథ్యంలో ఉమ్మడి మెదక్,నిజామాబాద్ జిల్లాల ముఖ్యనేతలతో, అధినేత కేసీఆర్ బుధవారం ఎర్రవెల్లి నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు, మెదక్ జిల్లా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్,ఎమ్మెల్యేలు సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు కె. ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు చింత ప్రభాకర్, మాణిక్ రావు, మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి,సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరీ సుభాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, ,భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు జైపాల్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్,గణేష్ బిగాల గుప్త, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, నిజామాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు అశన్న గారిజీవన్ రెడ్డి, కామారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్, ఆయేషా షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.