టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన కేసీఆర్..

భార‌త్ రాష్ట్ర స‌మితిగా జాతీయ పార్టీని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. జాతీయ పార్టీగా మారుస్తూ ఏక‌గ్రీవ తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై సీఎం కేసీఆర్ సంత‌కం చేశారు. దీంతో 21 ఏండ్ల టీఆర్ఎస్ ప్ర‌స్థానంలో మ‌రో మలుపు చోటు చేసుకుంది. ప‌లు రాష్ట్రాల నేత‌ల స‌మ‌క్షంలో కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావ తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం ఆమోదించింది.

ఈ స‌మావేశంలో క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామితో పాటు జేడీఎస్ పార్టీకి చెందిన ప‌లువురు నేత‌లు, త‌మిళ‌నాడుకు చెందిన వీసీకే పార్టీ నేత‌లు హాజ‌ర‌య్యారు. టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ చ‌దివి వినిపించారు.

Leave a Reply