Suryaa.co.in

Features

కేరళ ఝాన్సీరాణి శశికళ టీచర్

ప్రాణాలకు తెగించి శబరిమలను కాపాడుతున్న హిందూవీరులను తయారుచేసిన ఈ వీరవనిత ఎవరో తెలుసా.?..ఈరోజు రాజకీయాలకు అతీతంగా కేరళలో బంద్ ఎందుకు జరుగుతున్నదో తెలుసా ?

మన భారతీయ సనాతన సంప్రదాయాలు చూసి,.. వాటిలో ఉండే లోతైన శాస్త్రీయ విజ్ఞానాన్ని,.. ఆచరించడం వలన కలిగే శుభ ఫలితాలను… గమనించి, ఆచరించి.. మన భారతీయతను వారిలో సంపూర్ణంగా నింపుకుని… మనలో మమేకమైన వారిలో.. సర్ ఆర్థర్ కాటన్ దొర వద్ద నుంచి చూస్తే… సి.పి.బ్రౌన్… మొదలుకుని ఈ నాటికి…అనేకమంది పాశ్చాత్యులు, విదేశీయులు… పూర్తిగా వారి దేశాన్ని వదిలి.. మన భారతదేశంలోనే స్థిర నివాసం ఉంటూ….వారి జీవితాలు ధన్యం చేసుకుంటున్నారు ఎందరో… ఎందరెందరో….

నేటికీ మనం అరుణాచలం లోని రమణాశ్రమం లో… పాండిచ్చేరిలోని అరవిందాశ్రమం లోను… ఇంకా వివిధ ప్రదేశాలలో… విదేశీయులను కోకొల్లలుగా చూడవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం…

అది 1975 సంవత్సరం. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో 9వ తరగతి గది లో చరిత్ర ఉపాధ్యాయుడు పాఠం చెబుతున్నాడు. ఆ రోజు పాఠం ఔరంగజేబు దండయాత్రలు- శివాజీ మరియు శంభాజీ లు ఔరంగజేబు ఆగ్రా బంధీఖానా నుంచి తప్పించుకుని, ప్రతాప్‌ఘడ్ కోటకు చేరుకున్న ఘట్టం..

15 ఏళ్ళ బాలిక చెవులు చాటంత చేసుకుని ఏకాగ్రతగా వింటున్నది. పాఠం అయిపోయిన తరువాత ఉపాధ్యాయుని దగ్గరకెళ్ళి ఔరంగజేబు దౌర్జన్యాలూ అరాచకాల గురించి మరింతగా వివరంగా చెప్పమని ప్రాధేయపడింది. చుట్టూ ఉన్న పరిస్థితుల రీత్యా చెప్పడానికి ఆ ఉపాధ్యాయుడు నిరాకరించాడు.

కానీ ఆ బాలిక చలాకీతనాన్ని ఏకసంథాగ్రాహ.. నిశితాగ్ర బుధ్ధిని గమనించిన ఆ టీచరు కొన్ని పుస్తకాల పేర్లు చెప్పి లైబ్రరీకి వెళ్ళమన్నాడు. అంతే. ఆ బాలిక సరాసరి లైబ్రరీ కి వెళ్ళి.. లైబ్రేరియన్ “ఈరోజు సమయం అయిపోయింది, ఇక తలుపులు మూసేయాలి..” అని చెప్పే వరక ప్రతిరోజూ అనేక చరిత్ర పుస్తకాలు చదివేది.

ఆ తరువాత 6 ఏళ్ళకు 1981లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ పరీక్షలో Social Studies & History విభాగంలో ఈ బాలికే, జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుని ఉపాధ్యాయురాలిగా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది.

ఆమె చరిత్ర పాఠాలు చెబుతుంటే విద్యార్థులు నిజంగానే చరిత్రలోకి (ఆదిత్య 369 సినిమాలో మాదిరి) వెళ్ళినంతగా ముగ్దులయ్యేవారు..
మన దేశంపై 712 AD లో మహమ్మద్బీ న్‌ఖాసిం తో ప్రారంభమైన దండయాత్రలు, ఏ విధంగా 2014 వరకు కొనసాగాయో వివరించి చెప్పేది.

కానీ ఇదంతా ఇతర మతస్తులకూ.., కమ్యూనిస్టులకూ… తల నొప్పిగా మారింది. దీనితో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆమె ధీరవనిత., ఏమాత్రం వెనకడుగు వేయలేదు. అప్పుడు క్లాస్‌ రూం వదిలి.. సభలు సమావేశాలు నిర్వహించి హిందువులు ఏ విధంగా 1200 ఏళ్ళుగా ఊచకోతకు గురయ్యారో వివరిస్తూ అసలైన చరిత్రను చెప్పసాగింది.

ఆమెను 2003లో హిందూ ఐక్య వేదిక కు (HAV) ఉపాధ్యక్షురాలిగా హైందవ సంఘాలు ఎన్నుకున్నాయి. అప్పటి నుంచి సర్వస్వం హిందువుల అభ్యున్నతికే పాటుపడుతూ పోరాడుతున్నది.. కేవలం నాలుగేళ్ళ లోనే 2007 లో “హిందూ ఐక్య వేదిక” కు ఆమె అధ్యక్షురాలు అయినది.

కేరళలోని దక్షిణ మలబార్ జిల్లాలైన పాలక్కాడ్, త్రిశూర్, మలప్పురం జిల్లాలలో ఆమెకు లక్షలాదిమంది అనుచరులు ఉన్నారు.. ఆమెపై ఇంతవరకు 3సార్లు హత్యాయత్నాలు జరిగాయి. ప్రతిసారీ కోలుకుని రెట్టించిన ఉత్సాహంతో ఆమె పని చేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె పాలక్కాడ్ జిల్లా వల్లప్పూజ అనే మేజర్ పంచాయితీ గ్రామంలో, ఉన్నత పాఠశాలలో డిప్యూటీ హెడ్‌ మిస్ట్రెస్‌ గా పనిచేస్తున్నారు.. 37 ఏళ్ళుగా ఉపాధ్యాయురాలిగా ఎంతోమంది హిందూ వీరులను ఆమె తయారుచేసింది..

అయ్యప్ప శబరిమల విషయంలో ఆమె నేతృత్వంలోనే ఉద్యమం నడుస్తున్నది.. స్వయానా సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వం ఒకటై దుష్టులకు అండగా ఉన్నా కూడా, ఆమె వ్యూహం వల్లనే సన్నిధానం లోకి ఆ దుర్మార్గులు అడుగు పెట్టలేక పోతున్నారు..

దానితో ఆమెను కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వం నిన్న అరెస్టు చేసింది.. ఆమె అరెస్టుకు నిరసనగా రాజకీయాలకు అతీతంగా.. నేడు కేరళలో బంద్ జరుగుతున్నది.

ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి ?
ఆవిడ తన జీవితాన్నే పణంగా పెట్టి, మన భారత దేశం కోసం, సనాతన సాంప్రదాయ కోసం పోరాడుతూ ఉంటే…. నేటికీ బ్రిటిష్ పరిపాలన విధానాలను తమ నరనరాలలో జీర్ణించుకున్న కొంతమంది… రాజకీయ నేతలు… ఆమెను ఇబ్బందులపాలు చేస్తూ…. చివరికి ఆమెను కారాగారం పాలు చేస్తే…. స్పందించాల్సిన అవసరం మనకు లేదంటారా…?

ఇప్పటికైనా మేల్కొని మన స్పందనలను వివిధ మార్గాల ద్వారా తెలియ చేద్దామా….? లేక… ఎప్పటికీ చేతులు ముడుచుకుని కూర్చుని అంతా అయిపోయాక….

భగత్ సింగ్..
అల్లూరి
నేతాజీ వంటి దేశభక్తులు..

ఈ అవినీతి పరుల…అరాచకవాదుల దౌర్జన్యాలకు బలైపోయాక.. బాగా తీరిక చేసుకుని వారి శిలా విగ్రహాలు ముందు.. మన దేశ భక్తిని ప్రదర్శించు కుంటున్నట్లుగా… మన అనుకూలం ని బట్టి.. స్పందిద్దామా….?

ఇంతకూ ఆ వీరవనిత పేరు చెప్పలేదు కదూ..
ఆమె పేరు కెపి శశికళ .

“కెపి శశికళ టీచర్” అంటే తెలియని వారు కేరళలో కనిపించరు. ఆమెను “కేరళ_ఝాన్సీరాణి” అని అక్కడి వారు ఎంతో గౌరవంగా పిలుచుకుంటారు.

– వి. ఎస్. మూర్తి

 

LEAVE A RESPONSE