Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరిన కొలికపూడి శ్రీనివాస రావు

ఉండవల్లి:టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కొలికపూడి శ్రీనివాసరావు శుక్రవారం పార్టీలో చేరారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు…తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని వారు తెలిపారు

రాష్ట్రానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పార్టీలో చేరిన కొలికపూడి చెప్పారు

రాష్ట్రం కోసం, యువత భవిష్యత్ కోసం రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపించేందుకు పనిచేస్తామని ఈ సందర్భంగా కొలికపూడి ప్రకటించారు. ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని దించేందుకు కలిసి వచ్చిన కొలికపూడిని చంద్రబాబు ఈ సందర్భంగా అభినందించారు తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

LEAVE A RESPONSE