తనతో సమానంగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లను తన ప్రక్కనే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.పోలీస్ శాఖలో ఏదైనా కేసును ఛేదించితే, కేసు చేదనలో కృషి చేసిన సిబ్బందికి కాకుండ పోలీస్ ఆఫిసర్లకు మాత్రమే గౌరవం దక్కేది.విధి నిర్వహణలో ర్యాంకులతో సంబంధం లేదని అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్కరికి తన పక్కన సముచిత స్థానం ఉంటుందని నిరూపించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్.మునుపెన్నడూ లేనివిధంగా అవనిగడ్డ బాలుడి కిడ్నాప్ కేసును చేదించడంలో కృషి చేసిన కానిస్టేబుల్స్ యొక్క ప్రతిభను గుర్తించి, ప్రత్యేకంగా అభినందించి, వారిని తన పక్కన కూర్చోబెట్టుకుని, విలేఖరుల సమావేశం నిర్వహించి,తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ.ఆయన పక్కనే కూర్చోబెట్టి ఆయనతో సమానంగా ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన కానిస్టేబుల్స్.ఇలాంటి ఎస్పి జిల్లాకు వచ్చినందుకు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసిన కానిస్టేబుల్స్…
Devotional
బ్రహ్మ కడిగిన పాదం
– ఏమిటా సందర్భం? పురాణకథలను అనుసరించి గంగా దేవి హిమవంతుడి కూతురు. చతుర్ముఖ బ్రహ్మ ఆమెని దత్త పుత్రికగా స్వీకరించి, పరమశివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుడి వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ దేవుడు వాత్సల్యంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఆయనను ఓదార్చిన గంగ- బ్రహ్మదేవుడి కమండలంలో తాను జలరూపంలో ఉంటానని చెప్పి, వనితారూపంలో పరమశివుణ్ణి…
అక్షయ తృతీయ రోజునే చందనోత్సవం ఎందుకు ?
సింహాచలంలో వరాహనరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది ! ఈ రోజు మూలవిరాట్టు మీద ఉన్న చందనాన్ని తొలగించి స్వామివారి నిజరూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. దాదాపు పన్నెండు గంటలపాటు ఈ నిజరూపదర్శనం సాగిన తరువాత తిరిగి స్వామివారికి చందనాన్ని అలంకరిస్తారు. ఇదంతా అక్షయ తృతీయ రోజునే జరగడానికి కారణం ఏమిటి ? పూర్వం తన భక్తుడైన…
Sports
అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ
న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…
ఐసీసీ ఛైర్మన్గా జై షా?
ఐసీసీ ఛైర్మన్గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…