Suryaa.co.in

Andhra Pradesh

మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ

తనతో సమానంగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లను తన ప్రక్కనే ప్రెస్ మీట్ లో కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.పోలీస్ శాఖలో ఏదైనా కేసును ఛేదించితే, కేసు చేదనలో కృషి చేసిన సిబ్బందికి కాకుండ పోలీస్ ఆఫిసర్లకు మాత్రమే గౌరవం దక్కేది.విధి నిర్వహణలో ర్యాంకులతో సంబంధం లేదని అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే ప్రతి ఒక్కరికి తన పక్కన సముచిత స్థానం ఉంటుందని నిరూపించారు కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్.మునుపెన్నడూ లేనివిధంగా అవనిగడ్డ బాలుడి కిడ్నాప్ కేసును చేదించడంలో కృషి చేసిన కానిస్టేబుల్స్ యొక్క ప్రతిభను గుర్తించి, ప్రత్యేకంగా అభినందించి, వారిని తన పక్కన కూర్చోబెట్టుకుని, విలేఖరుల సమావేశం నిర్వహించి,తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ.ఆయన పక్కనే కూర్చోబెట్టి ఆయనతో సమానంగా ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపిన కానిస్టేబుల్స్.ఇలాంటి ఎస్పి జిల్లాకు వచ్చినందుకు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసిన కానిస్టేబుల్స్…

LEAVE A RESPONSE