Suryaa.co.in

Andhra Pradesh

బాబు సీఎంగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లాలో భూ అక్రమాలు

– డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
తిరుపతి : 2320ఎకరాలు భూములు అక్రమాలు జరిగినట్లు సి.ఐ. డి విచారణలో తేలింది.ఎస్టేట్ ఏబలిస్ యాక్ట్ ఆసరాగా చేసుకుని భూములు ఆక్రమణలు చేశారు. 290 ఎకరాలు సోమల మండలం టీడీపీ నేత సహకారంతో అక్రమాలు పాల్పడ్డారు.చంద్రబాబు సహకారంతో చిత్తూరుజిల్లా లో భూ అక్రమాలు కు టీడీపీ నేతలు పాలడ్డారు.2014-19 వరకు 14 మండలాల్లో టీడీపీ నేతలు జయశంకర్,సుధాకర్ చౌదరి,రామకృష్ణ నాయుడు, రామచంద్రా నాయుడు, అడవి రమణ భూములు అక్రమాలకు పాల్పడ్డారు.
తక్కువ ధరకు కొనుగు చేసి వీటిపై విచారణ జరగాలని కోరుతున్నాం.ఎస్టేట్ భూములు సంబంధించిన వాటిపై సర్వే జరుగుతోంది..వీటిని స్వాధీనం చేసుకుంటాం. చిత్తూరుజిల్లా లో 15వేల ఎకరాలు భూ అక్రమాలు అడవి భూములు అన్యాక్రాంతం అయ్యాయి.ప్రతి పేదవాడికి ఇంటి స్థలం అందించాలని లక్ష్యం తో సీఎం కృషి చేస్తే.. చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తున్నారు.చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితి లో ప్రజలు లేరు. అటవీ భూములు ఆక్రమణలు చేసిన వాటిపై విచారణ జరిపిస్తాం. చిత్తూరుజిల్లా లో టీడీపీ నేత ఒక్కొక్కరి వద్ద 200 ఎకరాలు నుంచి 300 ఎకరాలు పెట్టుకున్నారు.

LEAVE A RESPONSE