Suryaa.co.in

Andhra Pradesh

లిక్కర్ అమ్మకాలు, ఆదాయాల డేటా వెబ్ సైట్ ను తొలగించారు

-కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు లిక్కర్ డేటాను వెబ్ సైట్‌ నుంచి తొలగించారు
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర తెదేపా అధ్యక్షులు అచ్చెన్న లేఖ

వైకాపా ప్రభుత్వం పారదర్శకతకు పాతరేస్తోంది. ప్రజల ముందు ఉంచాల్సిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతోంది. మొన్నటి వరకు ప్రభుత్వ జీవోలను రహస్యంగా ఉంచారు. హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా టిడిపి ప్రభుత్వం తీసుకొచ్చిన పారదర్శకత, జవాబుదారీతనాన్ని వైకాపా ప్రభుత్వం ధ్వంసం చేస్తోంది.

లిక్కర్‌ అమ్మకాలు, ఆదాయాలకు సంబంధించిన డేటాను వైకాపా ప్రభుత్వం వెబ్ సైట్ నుంచి తొలగించింది లిక్కర్ ఆదాయం ఎక్కడికి వెళుతోందో మీకు తెలుసే ఉంటుంది. దేశ వ్యాప్తంగా పారదర్శకత కోసం డిజిటల్ ట్రాన్సాక్షన్ వైపు మళ్లుతుంటే ఏపీలో మాత్రం క్యాష్ ట్రాన్సాక్షన్‌లో మాత్రమే అమ్మకాలు చేస్తోంది. వైకాపా నాయకులు వారి రాజకాయ లబ్దికోసం అధికారులు తప్పులు చేసేలా ఒత్తిడి చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఒత్తడిలకు తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే ఇబ్బందులు పడుతారు.

మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్న సందర్భంలో ఎన్నికల సంఘం కంటపడకుండా ఉండేందుకు వైకాపా ప్రభుత్వం లిక్కర్ డేటాను రహస్యంగా ఉంచుతోంది. కోర్టు స్క్రూటినీ నుంచి తప్పించుకునేందుకు, లిక్కర్ డేటానే తారుమారు చేసేందుకు లిక్కర్ డేటాను వెబ్ సైట్‌ నుంచి తొలగించారు. వైకాపా నాయకుల ఒత్తిడికి తలొగ్గకుండా అధికారులు చట్టం ప్రకారం పనిచేసేలా చూడండి. లిక్కర్ అమ్మకాల, ఆదాయాలకు సంబంధించిన డేటా వెబ్ సైట్ ను పునరుద్దరించాలి.

LEAVE A RESPONSE