– జగన్పైనా జనం తిరుగుబాటు చేసే సమయం వచ్చింది
-టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజలకు సంక్షేమం అందిస్తాం
– విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి
– దళిత భూములను లాక్కున్న వైసీపీ పార్టీని గద్దె దింపుతాం
– మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు
తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అభ్యునతి కోసం భవిష్యత్తుకు గ్యారెంటీ అని ప్రకటించిన మినీ మేనిఫెస్టో వివరాలను రాష్ట్ర ప్రజలకు తెలపడానికి చేపట్టిన చైతన్య రథయాత్ర (బస్సు యాత్ర) కార్యక్రమం.
జోన్- 1 పరిధిలోని అరకు పార్లమెంట్, కురుపాం నియోజకవర్గం నుందు నియోజకవర్గం ఇంచార్జీ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం ఇంచార్జ్ గారు పార్లమెంట్ పరిధిలోని ముఖ్యనాయకులు, స్థానిక నాయకులతో కలిసి బస్సుయాత్రను ప్రారంభించడం జరిగింది. యాత్ర ప్రారంభించిన అనంతరం గరుగుబిల్లి మండలం వుల్లిభద్ర నందుస్వాగత కార్యక్రమం జరిగింది.
జంజావతి కాలువా సందర్శించారు. కార్యక్రమం అనంతరం జెండా వూపి బస్సు యాత్ర ప్రారంభించారు. అనంతరం వుల్లిభద్రలో 1200 మోటార్ సైకిల్లతో ర్యాలీగా వెళ్లి తోటపల్లి పాత యడమ కాలువ ఆధునీకరణ పనులు పరిశీలించి సెల్ఫీ తీసుకోవటం జరిగింది. అనంతరం తోటపల్లిలో గ్రామాలనుండి వచ్చిన జనసమూహం మధ్య బహిరంగ సభ భారీగా జరిగింది.. అనంతరం చినమెరంగి వరకు బస్సు యాత్ర బుక్ ర్యాలీ జరిగింది.అనంతరం కార్యకర్తలకు, నాయకులకు భోజనాలు జరిగాయి. అనంతరం పుర్ణపాడు లాబేసు అసంపూర్తిగా వున్న పనులను పరిశీలించి , సెల్ఫీ తీసుకున్నారు.
అనంతరం ఇటీవల తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మిని మేనిఫెస్టో ను బహిరంగ సభలో ప్రజలకు వివరించడం జరిగింది. కార్యక్రమం నియోజకవర్గంలొ విజయవంతం అయింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్ , , కురుపాం నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీస్వరి ,తోయక జగదీశ్వరి కురుపాం నియోజకవర్గ పరిశీలకులు ఆరేటి మహేష్ బాబు కురుపాం నియోజకవర్గ పరిశీలకులు, పార్వతీపురం నియోజకవర్గ ఇన్చార్జి బొబ్బిలి చిరంజీవులు ,బొంగు సురేష్ , ఎంపీపీ – జియ్యమవలస మండలం, మర్రాపు పురుషోత్తం నాయుడు, రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి, మరడాన తవిటి నాయుడురాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి, నంగిరెడ్డి మధుసూదన్ రావు, అరుకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు, గులిపిల్లి సుదర్శన్ రావుజిల్లా పరిషత్ మాజీ చైర్మన్, దత్తి లక్ష్మణా రావుమాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ద్వారపురెడ్డి సత్యన్నారాయణ, మాజీ ఎంపీపీ – గరుగుబిల్లి మండలం,పెద్దింటి పూర్ణచంద్రరావుఅరకు పార్లమెంట్ కార్యదర్శి,ముదిలి విజయంకుషంఅరకు పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిడొంకాడ రామక్రిష్ణఅరకు పార్లమెంట్ అధికార ప్రతినిధిదేవకోటి వెంకట నాయుడుఅరకు పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులువెంపటాపు భారతిమాజీ ఎంపీపీ – కురుపాం మండలంకోలా రంజిత్ కుమార్తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి, సుకేష్ చంద్ర పండా ,రాష్ట్ర TNSF మీడియా కోఆర్డినేటర్కురుపాం నియోజకవర్గ ఐటీడీపీ ఛాంపియన్కోట సుమన్అరకు పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్, అంబటి తవిటినాయుడు, అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులునందివాడ కృష్ణ బాబు, యస్. టి సెల్ అధికార ప్రతినిధిమరడాన సింహాచలంఎంపీటీసీ పొట్నూరు వెంకటనాయుడు, పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ , పార్వతీపురం జిల్లా ముఖ్య నాయకులు కురుపాం నియోజకవర్గంలో గల అన్ని మండలాల మండలపార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
జోన్-2 టిడిపి చైతన్య రథయాత్ర మంగళవారం నాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో నిర్వహించారు. అమలాపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో భట్నవిల్లిలో శ్రీ విజయదుర్గమ్మ ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం బస్సుయాత్ర ప్రారంభించారు. అక్కడ నుండి కామనగరువు, నల్లవంతెన, ఎర్రవంతెనకు చేరుకుంది.
ఎర్రవంతెన వద్ద స్వర్గీయ ఎన్టీఆర్, స్వర్గీయ మెట్ల సత్యనారాయణరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి తిరిగి నల్లవంతెన, కామనగరువు, పేరూరు వై. జంక్షన్, కాలేజి రోడ్, హైస్కూల్ సెంటర్, గడియారస్థంభం సెంటర్, ముమ్మిడివరం గేటు మీదుగా డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు కాపు కళ్యాణ మండపం వరకూ చైతన్యరథ యాత్ర నిర్వహించారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ…. వైసీపీ పాలనలో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని దివాళా తీయించి ఆయన ఆస్తులు పెంచుకున్నాడని ఆరోపించారు. జగన్ ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని మండిపడ్డారు. అమరావతి రాజధాని విచ్ఛిన్నానికి జగన్ చేపట్టిన చర్యలను తప్పుబట్టారు. మూడు రాజధానుల అధికారం జగన్ రెడ్డికి లేకున్నా అమరావతి రాజధాని విధ్వంసానికి జగన్ కుట్ర పన్నుతున్నాడని విమర్శించారు.
ఢిల్లీ నుండి దౌలతాబాద్ కు, దౌలతాబాద్ నుండి ఢిల్లీకి రాజధాని మార్చి మహ్మద్ బీన్ తుగ్లక్ చేసిన చర్యల మూలంగా ఖజానా ఖాళీ అయిందని, ఆ తర్వాత తుగ్లక్ వంశం క్షీణించిందని, అదే పరిస్థితి రేపు జగన్ రెడ్డికి తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర సంపదను అతని సంపదగా మార్చుకుంటున్న కారణంగా ప్రభుత్వం అప్పుల పాలవుతోందన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవాలంటే, మన భవిష్యత్ బాగుండాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఫ్రెంచ్ విప్లవంలో లూయిస్ పాశ్చర్ యుద్ధోన్మాదం ఆ దేశాన్ని నాశనం చేసిందని, చివరికి విసిగి వేసారిన ప్రజలు ఆ రాజును నరికి చంపారని గుర్తు చేశారు. జగన్ రెడ్డికి కూడా ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి, అతని అనుచరగణం దోచుకున్న లక్షల కోట్ల రూపాయలను వెనక్కు తెచ్చి రైతులు, మహిళలు, యువత, పేదలు అందరికీ సంక్షేమ పథకాలు పంచిపెడతామని ఆయన తెలిపారు. ప్రజలలో పొదుపు అలవాటును ప్రోత్సహించి ప్రభుత్వ భాగస్వామ్యంతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.
జగన్ పాలనా వైఫల్యం కారణంగా ప్రజలపై 13 లక్షల కోట్ల భారం పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ సంక్షేమ పథకాల అమలులో కూడా ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డాడని, అప్పులు తెచ్చి పేదవాడి పేరు అడ్డం పెట్టుకుని సొంత ఖజానాకు తరలించుకున్నాడని ఆరోపించారు. అమలాపురంలో దివంగత లోకసభ స్పీకర్ జిఎంసి బాలయోగి, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావులతో కలిసి కోనసీమ ప్రాంత అభివృద్ధిలో పాలుపంచుకున్న రోజులను యనమల గుర్తు చేసుకున్నారు.
మెట్ల సత్యనారాయణ రావు కుమారుడు మెట్ల రమణబాబు, బాలయోగి వారసుడు హరీష్ బాలయోగిలు వారసత్వంగా తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అమలాపురం ఇంఛార్జి అయితాబత్తుల ఆనందరావు కూడా కష్టపడి పని చేసే నాయకుడని, పార్టీ విధానాలను బలంగా ప్రజలలోకి తీసుకు వెళుతున్నాడని అభినందించారు. అందరినీ కలుపుకుని వెళుతూ రాజకీయంగా మరింత పట్టు సాధించాలని ఆయన సూచించారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ… టిడిపికి కంచుకోట వంటి అమలాపురంలో తిరిగి పసుపు జెండా ఎగురవేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. టిడిపి ఇంఛార్జి అయితాబత్తుల ఆనందరావు అందరినీ కలుపుకుని వెళుతూ పార్టీని పటిష్టం చేసుకోవాలని సూచించారు.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రజల్ని రక్షించాల్సిన నాయకుడు ప్రజా భక్షకుడిగా మారాడని జగన్ రెడ్డిపై మండిపడ్డారు. మద్యాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల రక్తం తాగుతున్నాడని ఆరోపించారు.
జగన్ పాలనలో ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఇసుక మాఫియా, మట్టి తవ్వకాలతో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన నాయకుల పైనే కాదు.. మీడియా పైనా అక్రమ కేసులు, వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలలోకి వెళ్ళాలని ఆయన పిలుపునిచ్చారు.
టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. అది తప్పు ఇదిగో మన మినీ మేనిఫెస్టో.. ఈ పథకాలను ప్రజలలోకి తీసుకు వెళ్ళండి.. వైసీపీ పథకాలను తలదన్నే పథకాలు మనం అమలు చేస్తామని ప్రజలకు వివరించమని ఆయన పిలుపునిచ్చారు.
శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్, రామచంద్రపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ…. సంక్షేమ పథకాల అమలు ప్రారంభమైందే తెలుగుదేశంతో అని చెప్పారు. టిడిపి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రద్దు చేస్తారని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తప్పుబట్టారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇచ్చింది తెలుగుదేశం, పేద వారికి పక్కా ఇళ్ళు ఇచ్చింది తెలుగుదేశం.. పేదలకు సగం ధరకే జనతా వస్త్రాలు ఇచ్చింది తెలుగుదేశం… చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మరిన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఎస్సీ, బిసిలకు, కాపులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలను ఆయన గుర్తు చేశారు.
సభకు అధ్యక్షత వహించిన అమలాపురం నియోజకవర్గ టిడిపి ఇంఛార్జి అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ… ప్రశాంతంగా ఉండే అమలాపురం ప్రాంతాన్ని కులాల చిచ్చు రగిలించిన వైసీపీకి గుణపాఠం చెప్పాలన్నారు. అమలాపురం అభివృద్ధి జరిగిందంటే టిడిపి హాయాంలోనే అని చెప్పారు.
అమలాపురం పార్లమెంట్ టిడిపి ఇంఛార్జి గంటి హరీష్ బాలయోగి మాట్లాడుతూ …జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును కనీసం సస్పెండ్ చేయలేదని విమర్శించారు. పోలీసు రక్షణ కల్పించి మరీ సన్మాన సభలు జరుపుకోవడానికి అవకాశం కల్పించడం సిగ్గుచేటన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి మాట్లాడుతూ….. మినీ మేనీఫెస్టోలో సూపర్ సిక్స్ హామీల గురించి వివరించారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన తల్లికి వందనం, మహాశక్తి, దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు వరమని ఆమె చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా టిడిపి అధ్యక్షులు, మాజీ మంత్రి కెఎస్ జవహర్ మాట్లాడుతూ…. నాలుగేళ్ల జగన్ పాలనలో దళితులపై వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. టిడిపి హయాంలో దళితులకు అమలు చేసిన 27 పథకాలను జగన్ రద్దు చేశాడని ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం నిర్వహించిన అంబేద్కర్ విద్యాదీవెన పథకం పేరు మార్చి జగన్ విద్యాదీవెన అని పేరు మార్చడాన్ని తప్పుబట్టారు.
ఈ సభలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రులు గొల్లపల్లి సూర్యారావు, చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎంపి ఎజెవి బుచ్చిమహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, చిల్లా జగదీశ్వరి, రాష్ట్ర టిడిపి అధికార ప్రతినిధులు మోకా ఆనందసాగర్, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, జిల్లా టిడిపి ప్రధానకార్యదర్శి అల్లాడ స్వామినాయుడు, అమలాపురం నియోజకవర్గ పరిశీలకులు పెచ్చెట్టి బాబు, రాష్ట్ర టిడిపి కార్యదర్శులు పెచ్చెట్టి చంద్రమౌళి, మద్దాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, రాష్ట్ర తెలుగుయువత ప్రధాన కార్యదర్శి చెరుకూరి సాయిరామ్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దంతులూరి శ్రీనివాసరాజు, జోన్-2 మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు, జిల్లా తెలుగురైతు అధ్యక్షులు మట్టా మహాలక్ష్మి ప్రభాకర్, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, జిల్లా తెలుగుమహిళ అధ్యక్షురాలు పెచ్చెట్టి విజయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి అధికారి జయవెంకట లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, పశ్చిమ గోదావరి టిడిపి అధికార ప్రతినిధి వీరవల్లి శ్రీనివాస్, టిడిపి సీనియర్ నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, దెందుకూరి సత్తిబాబురాజు, మల్లుల పోలయ్య, అరిగెల నానాజీ, దేశంసెట్టి లక్ష్మీనారాయణ, ఆకుల రామకృష్ణ, చిక్కాల గణేష్, బోళ్ళ ప్రసాద్, బొర్రా ఈశ్వరరావు, బోళ్ళ వెంకటరమణ, పొలమూరి ధర్మపాల్, ఆవుపాటి వేణుగోపాల్, తెలుగుమహిళ రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ మద్దుల రాజేశ్వరి, మాకిరెఢ్డి పూర్ణిమ మోకా పార్వతి తదితరులు పాల్గొన్నారు.
జోన్ 4 భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్రను రాజంపేట పార్లమెంట్ రాయచోటి నియోజకవర్గం సంబెపల్లి మండలం గుట్టపల్లి నందు వెలసిన శ్రీ అంజనేయ స్వామి గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి గుడి దగ్గర నుండి వైభవంగా బాణాసంచా, కేరళ డ్రమ్స్, డీజే, బైక్ ర్యాలీ, లంబాడి మహిళల నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. కాలినడకన గుట్టపల్లి నుండి దేవపట్ల వరకు 2కిలోమీటర్లు మేర పాదయాత్ర చేయడం జరిగింది. దేవపట్ల లో మండల నాయకులు ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలు, ఆక్రమణలపై ప్రజలకు తెలియజేసి ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రజలను కోరడమైనది.
అక్కడే మధ్యాహ్నం భోజనం తర్వాత బయలుదేరి శ్రీ దేవరాయ నల్ల గంగమ్మ తల్లి గుడి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం రాయచోటి పట్టణం నందు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ దగ్గర సెల్ఫీ చాలెంజ్ దిగి అటునుంచి శిబ్యాల రోడ్డులో టిడ్కో గృహ సముదాయాల వద్ద సెల్ఫీ కార్యక్రమం లో పాల్గొన్నారు. అక్కడ నుంచి బయలుదేరి రాయచోటి పట్టణంలోకి ప్రవేశించి కిలోమీటర్ మేర పాదయాత్ర, బైక్ ర్యాలీ చేసుకుంటూ చలంపల్లి దగ్గర ఏర్పాటుచేసిన రచ్చబండ కార్యక్రమానికి చేరుకున్న రాష్ట్ర, నియోజకవర్గం ముఖ్య నాయకులకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు కార్యాకర్తలు బాణాసంచాతో ఘన స్వాగతం పలికి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినారు. రచ్చబండ కార్యక్రమంలో భవిష్యత్ గ్యారెంటీ మేనిఫెస్టో కరపత్రాలను ఆవిష్కరించారు. అక్కడే పల్లె నిద్ర నిర్వహించినారు.
రాయచోటి నియోజకవర్గం సంబెపల్లి మండలం గుట్టపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బస్సు యాత్ర చేపట్టడం జరిగింది, ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం ఇంచార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి , రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి ,తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ , మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ , మాజీ ఎమ్మెల్సీ & రాజంపేట నియోజకవర్గం ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ,మాజీ ఎమ్మెల్యే షాజహాన్ , రాష్ట్ర కార్యనిర్వాహన కార్యదర్శి పర్వీన్ తాజ్ , రాష్ట్ర కార్యదర్శి & కుప్పం నియోజకవర్గ పరిశీలకులు గాజుల ఖాదర్ భాషా తెలుగు రైతు కార్యదర్శి చింతం శివారెడ్డి , రాజంపేట పార్లమెంట్ బీ సీ సంఘం అధ్యక్షులు సురేంద్ర యాదవ్ , పీలేరు యువత అధ్యక్షులు మహేందర్ రెడ్డి , రాయచోటి నియోజకవర్గం ముఖ్య నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నర్సారెడ్డి, రాష్ట్ర / నియోజకవర్గ / మండల / గ్రామ,క్లస్టర్,యూనిట్,బూత్ నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కలసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
జోన్ -5 నందికొట్కూరు నియోజవకర్గంలో బస్సుయాత్రతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో జోన్-5 బస్సు యాత్ర కార్యక్రమం. నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జి మండ్ర శివానంద రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అల్లూరు గ్రామం లో బస్ యాత్ర ప్రారంభం చేసారు, మల్లియల లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ చేసారు, అనంతరం నందికొట్కూరు పట్టణంలో సూర్య నారాయణస్వామి దేవాలయం మరియు హనుమాన్ దేవాలయం లో పూజలు చేసి పాదయాత్ర మొదలు పెట్టారు.
పాదయాత్రలో పట్టణం లోని ప్రముఖుల విగ్రహాలకు దండలు వేసి నివాళులు అర్పించారు,యువగలం 2000 కి.మీ కేక్ కట్ చేసి వేడుక చేసారు, అనంతరం ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్ తగడంచ గ్రామంలో సెల్ఫీ ఛాలెంజ్ చేశారు, భోజన విరామం తరువాత ప్రెస్ మీట్ పెట్టి భవిష్యత్తుకు బరోసా పథకాలు గురుంచి వివరించారు, అనంతరం పాములపాడు గ్రామములో డాక్టర్ అంబేత్కర్ విగ్రహానికి పూల మాలు వేసి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు NMD ఫరూక్, రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహ్మద్,పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, పార్లమెంట్ ఇంచార్జి మండ్ర శివానంద రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ లు గౌరు చరిత, ఎం సుబ్బారెడ్డి, ,రాష్ట్ర కమిటీ కార్యదర్శి వలసల రామకృష్ణ, నియోజకవర్గ పరిశీలకుడు దేవేళ్ల మురళి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ సూర్య, అధికార ప్రతినిధి డాక్టర్ కె వెంకట స్వామి,నంద్యాల పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షుడు మల్లికార్జున మరియు డోన్, ప్యాపిలి,నందికొట్కూరు, మిడ్తూరు, కొత్తపల్లె, పాములపాడు, జూపాడు బంగ్లా మరియు పగిడ్యాల మండల అధ్యక్షులు ముఖ్య నాయకులతో పాటు జిల్లాలో లో గల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.