-జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు మజ్లిస్ మద్దతు
– టిక్కెట్ను బీసీలకు ఇచ్చే అవకాశం
– స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి అభ్యర్థులకు టిక్కెట్లు
– డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవుల భర్తీ
– త్వరలో కామారెడ్డిలో బహిరంగ సభ
– టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ స్పష్టీకరణ
హైదరాబాద్: ‘‘ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ మా తోనే ఉంటుంది మా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇస్తుంది. మజ్లిస్ మా కు ఫ్రెండ్లీ పార్టీ’’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.
కంటోన్మెంట్ మాదిరిగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టిక్కెట్ను బీసీలకు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పరిస్థితిని బట్టి మిత్రపక్షాల అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. సీపీఎం, సీపీఐ, తెలంగాణ జనసమితి అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. డిసెంబర్ చివరి నాటికి పార్టీ పదవులన్నింటిని భర్తీ చేస్తామని వెల్లడించారు.
బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును తాము ముందుగా ఊహించిందేనని ఆయన అన్నారు. త్వరలో కామారెడ్డిలో బహిరంగ సభ ఉంటుందని మహేష్కుమార్ గౌడ్ వెల్లడించారు.