Suryaa.co.in

National

భార్యకు కానుకగా చంద్రుడిపై స్థలం

మధ్యప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన హరీశ్‌ మహాజన్‌ తన భార్యకు చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. వాస్తవానికి గతేడాదే జాబిల్లిపై స్థలం కొనుగోలు చేయాలని ఆయన భావించారు.అందుకోసం ఇంటర్నేషనల్‌ లునార్‌ ల్యాండ్స్‌ సొసైటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది ప్రక్రియ అనంతరం.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో పంపించారు. అయితే ఎంత డబ్బు చెల్లించిందీ మాత్రం వెల్లడించలేదు. ఇది ప్రేమకు సంబంధించిన విషయమని.. డబ్బుది కాదని చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త గతంలో తన కుమారుడికి చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు.

LEAVE A RESPONSE