పాదయాత్రలో ఉన్న సీఎల్పీ నేత భట్టి కి ఫోన్ చేసినా మాణిక్యం ఠాగూర్

– సోనియా, రాహుల్ అభినందించారని వెల్లడించారు
– భట్టి చేస్తున్న పాదయాత్రకు ఎఐసిసి సంపూర్ణ సహకారం ఉంటుందని వెల్లడి

ప్రజా సమస్యల పరిష్కారంకై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన పాదయాత్ర ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ , అధినేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారని ఢీల్లి నుంచి AICC జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మానిఖ్యం ఠాగూర్ బుధవారం రాత్రి భట్టి విక్రమార్క మల్లు కి ఫోన్ చేసి తెలిపారు. ఈ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో నే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని భట్టి విక్రమార్క చేసే పాదయాత్రకు అధిష్టానం నుంచి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వారు తెలిపారని మాణిక్యం ఠాగూర్ గారు భట్టి విక్రమార్క కి ఫోన్ లో చెప్పారు.

మధిర నియోజకవర్గం చింతకాని మండలం రేపల్లెవాడలో పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్న సమయంలో ఠాగూర్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇదే క్రమంలో ఫోన్ ద్వారా గ్రామ ప్రజలకు మాణిక్యం ఠాగూర్, రాహుల్ గాంధీ పంపిన సందేశాన్ని వివరించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ డీజిల్ పెట్రోల్ గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తో పాటు ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర గురించి అది నేత రాహుల్ గాంధీ తెలుసుకొని అభినందించారని వెల్లడించారు.

రాహుల్ గాందీ నేతృత్వంలో తెలంగాణ లో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం రానున్నదని తెలిపారు. రానున్న రోజుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం ఉదృతం చేయాలన్నారు. భట్టి విక్రమార్క మాకు అత్యంత మిత్రుడని తన అనుబంధాన్ని ఈసందర్భంగా గుర్తు చేశారు. భట్టి తో కలిసి నడుస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. జైరాహుల్…జై సోనియమ్మ నినాదాలతో హోరెత్తించిన కాంగ్రెస్ కార్యకర్తలు….ఆనందం వ్యక్తం చేసిన టాగూర్..

Leave a Reply