Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబును కలిసిన మౌలానా ముస్తాక్ అహ్మద్

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన మౌలానా ముస్తాక్ అహ్మద్ కలిశారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తాక్ అహ్మద్ కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మైనారిటీల అభివృద్ధికి టీడీపీ కట్టుబడి వుందని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మైనారిటీలపై దాడులు పెరిగాయని తెలిపారు. మైనారిటీల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. పార్టీ పదవుల్లోనూ ముస్లిములకు సముచిత స్థానం కల్పించామని, ప్రభుత్వ దోపిడీ, అక్రమాలపై పారాడాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్రఅధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, పలువురు ముస్లిం నేతలు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE