తెలంగాణలో వైద్యం బాగోలేదని ఎలా అంటారు

– బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిని ఒక్కసారి వెళ్లి చూడండి?
– డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరం
– గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా
– ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరం.కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తే మీరు విమర్శిస్తున్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది.ఎయిమ్స్ బీబీనగర్ ఆస్పత్రి వెళ్లి చూడండి, కనీస వసతులు కూడా లేవు.

ఈరోజు తాండూరు వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా, ANM లకు చేరెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉంది.ANM సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా చేస్తున్నాం. 3200 పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తున్నాం. డాక్టర్ లేదా స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉండి సేవలు అందిస్తారు.కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా నడుస్తున్నది. సీఎం కేసీఆర్ గారు మిమ్మల్ని ప్రగతి భవన్ పిలిచి, మాట్లాడి మీ కోరిక మేరకు జీతాలు పెంచారు.

ఎక్కడ 2000, ఎక్కడ 9750 రూపాయలు.? మధ్యప్రదేశ్ లో ఈరోజు కూడా 3000 మాత్రమే ఇస్తున్నారు. ఛత్తీస్ గడ్ లో 4000 ఇస్తున్నారు. మనం మాత్రం 9750 ఇస్తున్నాం.పని చేస్తే ప్రేమగా చూసుకుంటాం.బాగా పని చేసిన వారికి పిలిచి హైదరాబాద్ లో సన్మానం చేసాము.

వికారాబాద్ జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నది.మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు అని నేను ఉద్యమం సమయంలో అడిగాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు జిల్లాలుగా మారి, డిగ్రీ కాలేజీలు కాదు మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది.

మొన్ననే సీఎం కేసీఆర్ రూ. 235 కోట్లతో వికారాబాద్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో 30 కోట్లతో నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తాము.రూ. 15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి వికారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం.

గవర్నర్ వైద్యుల మనో దైర్యం దెబ్బతీసేలా మాట్లాడటం దురదృష్టకరం. ఒక డాక్టర్ అయి ఉండి అలా మాట్లాడటం బాధాకరం. ఇది తగదు. తెలంగాణలో వైద్యం బాగోలేదని ఎలా అంటారు. తీవ్రంగా ఖండిస్తున్నాను.సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది.కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించింది.ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే, మీరు విమర్శలు చేస్తారు. మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతున్నది.

ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనూ ఇంత పురోగతి లేదు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది.కేసీఆర్ కిట్, ఇతర చర్యల వల్ల 2014 లో 30 శాతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 66 శాతం చేరాయి.హెల్త్ అండ్ వెల్నెస్ ర్యాంకింగ్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉంది.మలేరియా నివారణలో 2 నుండి కేటగిరీ 1 కి రాష్ట్రం అభివృద్ధి చెందింది అని కేంద్రం వెల్లడించింది.

ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడం వల్ల, ఆశాలు ఏఎన్ఎంలు మా వైద్యాధికారులు ఎంతో కృషి చేయడం వల్ల సాధ్యమైంది. ఇది గవర్నర్ కి ఎందుకు అర్థం కావడం లేదు.ఒక డాక్టర్ గా మీరు తెలుసుకుని మాట్లాడాలి. గవర్నర్ గారు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిని ఒక్కసారి వెళ్లి చూడండి. ఇదే సమయంలో మా తెలంగాణ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు చూడండి. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా ఏమ్స్ లో లేవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైంది. పేషెంట్లు లేరు డెలివరీలు కావు. కనీస సౌకర్యాలు ఉండవు.

డాక్టర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం బాధాకరం.
వికారాబాద్ జిల్లా తాండూరు లో నిర్వహించిన ఆశ కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొన్న మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రరెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్ పీ ఛైర్మెన్ సునీతా మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply