Suryaa.co.in

Andhra Pradesh

ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీలు

– ఆస్పత్రి ని అణువణువునా పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
– టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై సంబంధిత అధికారులను నిలదీసిన మంత్రి

ఏలూరు: ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఎక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనపడకూడదని స్పష్టం చేశారు. ఓపీ సేవలు సరిగా అందకపోవడంపై ఆసుపత్రి వర్గాలపై అసహన వ్యక్తం చేశారు.

నడవలేని స్థితిలో ఉన్న రోగులకు వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహ వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇటువంటివి పునరావతం కాకూడదన్నారు. వైద్య సేవలు అందుతున్న తీరుపై రోగులను అడిగి వివరానికి తెలుసుకున్నారు ఇక, మగవారికి, మహిళలకు విడివిడిగా ఓపీ సేవలు సమర్థంగా అందేలా చూడాలని సూచించారు.

ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టాయిలెట్స్, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై అధికారులను నిలదీశారు.. నెల రోజుల్లో ఆస్పత్రిని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

LEAVE A RESPONSE