– మంత్రులూ ..జాగ్రత్తగా ఉండండి
– వంద శాతం రుణమాఫీ రాజీనామాకు సిద్ధం
– కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మంత్రుల ఫోన్లపై నిఘా వేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మీ ఫోన్లపై రేవంత్ అనుమానంతో నిఘా పెట్టారు. జాగ్రత్తగా ఉండండి అని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలి . సీఎం రేవంత్ రెడ్డికి తన పదవికి ఎక్కడ ముప్పు వాటిల్లుతుందోనన్న భయం పట్టుకుంది . అందుకే నిత్యం భయపడుతూ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
బీఆర్ఎస్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుంటే, బీజేపీ నేతలు ఆయనకు మద్దతు పలుకుతున్నారని.. కాంగ్రెస్,- బీజేపీలు కలిసి కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో కూడా వంద శాతం రుణమాఫీ జరగలేదని.. రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. కొందరు పెద్దల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.