పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు

– నీటి తీరువ , పన్నులు రద్దు చేసిన ఘనత కేసీఆర్ ది
– రైతులకు నీళ్లు ఇచ్చినం, గౌడన్లు కట్టినం, చెరువులు బాగు చేసినం
– తెలంగాణకు వచ్చి బీజేపీ నేతలు ఏం చెబుతారు?
– గజ్వెల్ రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్‌ పాయింట్‌ను ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి
– తొలి విడతలో ఏపీలోని కాకినాడ న్.ఎఫ్.సీ.ఎల్. నుంచి 21 బోగీలలో గజ్వేల్ కు చేరుకున్న 1300 మెట్రిక్‌ టన్నుల ఎరువులు

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు ఏమన్నారంటే..
ర్యాక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటం.రైల్వే లైన్ కేంద్రం బాధ్యత.. కానీ నేడు రైల్ రావడానికి కేంద్రం నిధులు తక్కువ, రాష్ట్ర నిధులు ఎక్కువ. నాటి ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యలు నిధులు ఇచ్చేవారు కాదు. రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు వాటి ఎప్పటికప్పుడు ఇచ్చాము.

కొత్తపల్లి – మనోహరబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసింది. ఈ లైన్ కోసం 2200 ఎకరాల భూ సేకరణ చేశాం. ఈ రెక్ పాయింట్ జిల్లా ప్రజలకు వరం. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామంటే, యాడికెళి ఇస్తావ్ అని నాటి కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నాడు. ఈ రోజు అది నిజం అయింది. నీటి తీరువ రద్దు, పన్నులు రద్దు చేసిన ఘనత కేసీఆర్ ది.

రైతులకు నీళ్లు ఇచ్చినం, గౌడన్లు కట్టినం, చెరువులు బాగు చేసినం, ఎరువులు ఇస్తున్నాము.రేపటి నుంచి రైతులకు రైతుబందు 7500 కోట్లు ఖాతాల్లో పడుతున్నాయి. పక్క రాష్ట్రాల్లో మీటర్లు పెట్టి నిధులు తెచ్చుకున్నారు. బాయిల కడా మీటర్లు పెట్టనందుకు రాష్ట్రానికి 25 వేళా కోట్లు రాకుండా పోయాయి.. అయినా రైతుల క్షేమమే ముఖ్యమని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మనము బాగవుతుంటే, అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక నిధులు అపుతున్నారు.

గతంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జై జవాన్, జై కిసాన్ అనే వారు.. నేడు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం నై జవాన్, నై కిసాన్ అంటున్నది.మొన్న నల్ల చట్టాలు తెచ్చి రైతుల ప్రాణాలు తీస్తే, నేడు ఆర్మీలో కాంట్రాక్ట్ సిస్టమ్ తెచ్చి యువకుల ఉసురు తీస్తున్నారు.

తెలంగాణకు వచ్చి బీజేపీ నేతలు ఏం చెబుతారు? నీతి ఆయోగ్ 24 వేల కోట్లు తెలంగాణకు ఇవ్వాలని చెప్పినా ఇవ్వలేదని చెబుతారా ? వరంగల్ కు మంజూరైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, గుజరాత్ కు తరలించుకు

పోయి తెలంగాణకు అన్యాయం చేశామని చెబుతారా ? మా ఐటీఐఆర్ రద్దు చేశామని చెబుతారా ? వరి కొనుమని అంటే నూకలు తినమని చెప్పి అవమాన పరిచిన ప్రభుత్వం బీజేపీ ది. మీరు హైదరాబాద్ కు వచ్చే లోపు వరి ధాన్యం ఎంత కొంటావో చెప్పి రావాలి. కేంద్రం కొంటానన్న రా రాయిస్ కూడా తీసుకోకుండా అన్యాయం చేస్తోంది.

మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నారంటే.. అనేక రకాల ఎగుమతుల సౌలభ్యం ఈ రేక్ పాయింట్ ద్వారా అందనుంది.ప్రజల ఊహలకు అందనిది, కలలో కూడా ఉహించని అభివృద్ధి టిఆర్ఎస్ హయాంలో జరుగుతున్నది. రాబోయే వందల సంవత్సరాల వరకు ప్రజల అవసరాలు తీర్చే పనులు జరుగుతున్నాయి.సీడ్ పాయింట్ గా గజ్వెల్ అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్ర బాగుపై విపక్షలకు ఆర్తి లేదు.

దేశంలో ఉన్న రెండు జాతీయ పార్టీలు దేశాన్ని ఎన్ని ఏళ్ళు ఏలినా తెలంగాణకు ఒరిగిందేమి లేదు.ఈ రోజు కేంద్రాన్ని ఏలుతున్న పార్టీ వరి సాగులో, వడ్ల కొనుగోలులో అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరించింది. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుకు రైతులు మొగ్గు చూపాలి. రైతులకు, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు.

Leave a Reply