ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే భారతదేశాన్ని అమ్మటమే

– మధిర సత్యాగ్రహ దీక్షలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మధిర నియోజక వర్గ కేంద్రంలోని ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భట్టి ఏమన్నారంటే..బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపత్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపద్ పథకం దేశ ప్రజల రక్షణ కోసం తక్షణమే విరమించుకోవాలి. ఆర్ఎస్ఎస్ వ్యక్తులను భారత రక్షణ రంగంలో పంపటం కోసమే కేంద్ర ప్రభుత్వం అగ్ని పద్ పథకాన్ని తీసుకొచ్చింది.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలవల్లే నిరుద్యోగులను ఆందోళన వైపు పురిగొల్పుతున్నాయి.రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగాలు ఇవ్వటం దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలో యువత హింస మార్గం వైపు మల్లుతున్నారు. ప్రభుత్వరంగ సంస్థలు అమ్మటం అంటే భారతదేశాన్ని అమ్మటమే.

యువతకు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థల అధిపతులు అయిన అంబానీ ఆదానీలకు దారాదత్తం చేస్తూ ఉన్న ఉద్యోగాలను కొల్ల గొడుతున్నారు.నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరూ కలిసి దేశాన్ని ఆదాని అంబానీ లకు అమ్ముతున్నారు. బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాల. గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుతంగా సత్యాగ్రహం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆయన అభినందించారు

Leave a Reply