Suryaa.co.in

Telangana

ఎమ్‌ఎమ్‌టిఎస్‌ ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు 50% వరకు తగ్గింపు

-`సబర్బన్‌ ఫస్ట్‌ క్లాస్‌ సింగిల్‌ జర్నీ చార్జీల తగ్గింపు 5 మే 2022 నుండి అమలు
-`ఫలక్‌నుమా ` సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` లింగంపల్లి ` రామచంద్రాపురం మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరం

సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ జంటనగరాల్లో ప్రముఖ సబర్బన్‌ రైలు సర్వీసు అయిన ఎమ్‌ఎమ్‌టిఎస్‌ (మల్టీ ` మోడల్‌ ట్రాన్స్‌పోర్టు సర్వీసు)లో ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికుల కోసం 50% వరకు చార్జీలు తగ్గించబడ్డాయి. సబర్బన్‌ రైళ్ల సర్వీసులలో ఫస్ట్‌ క్లాస్‌ చార్జీల తగ్గింపును 5 మే 2022 నుండి అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తదనుగుణంగా, సికింద్రాబాద్‌ మరియు హైదరాబాద్‌ డివిజన్లలోని సబర్బన్‌ సెక్షన్లలో ఎమ్‌ఎమ్‌టీఎస్‌ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సింగిల్‌ జర్నీ ఫస్ట్‌ క్లాస్‌ చార్జీలు తగ్గించబడ్డాయి.

ఎమ్‌ఎమ్‌టీఎస్‌లో ఫస్ట్‌ క్లాస్‌లో సింగిల్‌ జర్నీ ప్రయాణికుల కోసం తగ్గించిన చార్జీలు 5 మే 2022 తేదీ నుండి దిగువ విధంగా ఉంటాయి :
దూరం స్లాబ్‌ (కిమీలలో) ప్రస్తుత చార్జీ (రూ) ఫస్ట్‌క్లాస్‌లో తగ్గించిన సింగిల్‌ జర్నీ చార్జీ (రూ)
(5% జిఎస్‌టితో కలిపి)
1-5 50 25
6-10 50 25
11-15 65 35
16-20 100 55
21-25 100 55
26-30 145 85
31-35 145 85
36-40 155 90
41-45 155 90
దక్షిణ మధ్య రైల్వే కోవిడ్‌ లాక్‌డౌన్‌ అనంతరం ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసులను పునరుద్ధరించి శివారు ప్రాంతాల ప్రయాణికులకు ప్రయోజనం కలిగేలా ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సర్వీసుల సంఖ్యను క్రమంగా పెంచుతుంది. ప్రస్తుతం ఫలక్‌నుమా ` సికింద్రాబాద్‌ ` హైదరాబాద్‌ ` బేగంపేట ` లింగంపల్లి ` తెల్లాపూర్‌ ` రామచంద్రాపురం మధ్య 29 రైల్వే స్టేషన్లను కవర్‌ చేస్తూ 50 కిమీల మీదుగా 86 సర్వీసులను నడుపుతోంది. ఎమ్‌ఎమ్‌టీఎస్‌ సెక్షన్లలోని వివిధ స్టేషన్లలో రద్దీ సమయాలను దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులందరీ అవసరాలు నెరవేరేలా ఈ సర్వీసులు ప్రవేశపెట్టబడ్డాయి. జంట నగరాల్లోని శివారు ప్రాంతాల ప్రయాణికులకు వేగవంతమైన మరియు చౌకైన రవాణా మార్గాలను అందిస్తున్న ఈ సర్వీసులలో ధరల తగ్గింపు ప్రయాణికులకు మరింత ప్రయోజనం కలిగిస్తుంది.

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఈ ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు సూచించారు. వేసవికాలం మరియు ఎమ్‌ఎమ్‌టీఎస్‌ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ఈ సమయంలో ఫస్ట్‌ క్లాస్‌ చార్జీల తగ్గింపు ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.

LEAVE A RESPONSE