దేశ ప్రజల ఆమోదం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. 13 దేశాల అధినేతలకు సొంత ప్రజల ఆమోదం (అప్రూవల్) ఎంత ఉందన్న అంశంపై ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ సర్వేలో మోడీ 70 శాతం రేటింగ్స్ తో మొదటి స్థానం దక్కించుకున్నారు. జో బైడెన్, బోరిస్ జాన్సన్, ఏంజెలా మెర్కెల్ వంటి పాపులర్ లీడర్లను సైతం మోడీ అధిగమించారు. ఇక మెక్సికో ప్రెసిడెంట్ ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ 64 శాతం అప్రూవల్ రేటింగ్స్ తో మోడీ తర్వాత రెండో స్థానంలో నిలిచారు. ఇటలీ ప్రధాని మారియో ద్రాఘి 63 శాతం రేటింగ్స్ తో థర్డ్ ప్లేస్ పొందారు. అమెరికాకు చెందిన డేటా ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ 13 దేశాల అధినేతలకు ప్రజల ఆమోదంపై, వారానికి ఓసారి సర్వే రిజల్ట్ ను తన వెబ్ సైట్ లో పొందుపరుస్తోంది. ఆయా దేశాల్లోని పెద్ద వయసు వారితోనే సర్వే నిర్వహిస్తోంది. దేశాన్ని బట్టి, సర్వేలో పాల్గొన్న వారి సంఖ్యను నిర్ణయిస్తుంది. తాజాగా ఆగస్ట్ 31 నాటికి గత వారం రోజుల్లో జరిగిన సర్వేలో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిచారు.
Devotional
ఈ ఆలయంలో శ్రమే విరాళం.. డబ్బులకు చోటు లేదు
మన దేశంలో చిన్న పెద్ద అనేక ఆలయాలున్నాయి. ఎక్కువగా ఆలయాల్లో భక్తులు తమ శక్తి కొలదీ నగదు, బంగారం, వెండి వాటితో పాటు రకరకాల వస్తువులను విరాళాలుగా అందిస్తారు. అయితే ఒక ఆలయంలో మాత్రం డబ్బులు తీసుకోరు. కేవలం అక్కడ పనిని మాత్రమే చేయాల్సి ఉంటుంది. దాదాపు 12 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఆలయంలో…
ఉగాది ఆచారాలు – సత్ఫలితాలు
సంవత్సరాది రోజు – కుటుంబసభ్యులు అందరూ – సూర్యోదయపు పూర్వము నువ్వుల నూనె ఒంటికి రాసుకొని, శీకాయపొడి లేదా కుంకుళ్ళుతో అభ్యంగన స్నానమాచరించాలి. ఈ అభ్యంగన స్నాన విధి వలన జ్యేష్టాదేవి నిష్క్రమించి, లక్ష్మీ శక్తులకి ఆహ్వానం కలుగుతుంది. సంవత్సరాది రోజు ప్రాతఃకాల ప్రథమ పూజ అనంతరం, ‘ఉగాది పచ్చడి’ నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. ఉగాది…
Sports
ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు
* రూ.5 కోట్ల వ్యయంతో ముస్తాబు * వేగంగా జరుగుతున్న ఆధునీకరణ పనులు * హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో మైదానం మొత్తం పరిశీలించిన బీసీసీఐ, ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ప్రకటించారు. బుధవారం…
భారత ఖోఖో జట్లకు శాప్ ఛైర్మన్ అభినందన
ఢిల్లీ వేదికగా జరిగిన ఖోఖో పురుషుల, మహిళల ప్రపంచకప్లో భారత జట్లు విజేతగా నిలవడం గర్వించదగ్గ విషయమని, ప్రపంచ వ్యాప్తంగా మహిళల విభాగంలో 23 దేశాల జట్లు, పురుషుల విభాగంలో 19 దేశాల జట్లు తలపడగా భారత జట్లు ప్రదర్శించిన ప్రతిభ అద్భుతమని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా…